SBI Bank: బ్యాంక్ ఖాతాదారులను ఇలా కూడా మోసం చేస్తుందా ఎస్బీఐ..? ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూపాయిల కరెంటు బిల్లు కట్టబోయి ఏకంగా రూ. 1.99 లక్షలు పోగొట్టుకున్న ఒక ఎస్బీఐ (SBI) ఖాతాదారుడికి వినియోగదారుల కోర్టులో న్యాయం జరిగింది. బెంగళూరుకు చెందిన ప్రదోష్ కుమార్ అనే వ్యక్తికి ఎదురైన ఈ చేదు అనుభవం, ఆ తర్వాత ఆయన సాగించిన పోరాటం గురించి తెలుసుకుందాం.
అసలేం జరిగింది?
2022 జూలైలో ప్రదోష్కు ఒక ఎస్సెమ్మెస్ (SMS) వచ్చింది. “మీ కరెంటు బిల్లు కట్టలేదు, వెంటనే కట్టకపోతే కరెంటు కట్ చేస్తాం” అన్నది ఆ మెసేజ్లో ఉంది. భయపడిన ఆయన, ఆ మెసేజ్లో ఉన్న నంబర్కు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి చెప్పినట్లుగా ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకుని, కేవలం 20 రూపాయల బిల్లు కట్టడానికి ప్రయత్నించారు. అంతే.. వెంటనే ఆయన ఖాతా నుంచి మొదట రూ. 25,000, ఆ తర్వాత రూ. 1.99 లక్షలు కట్ అయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆయనకు ఎలాంటి ఓటీపీ (OTP) రాలేదు.
Also Read
- SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్లు.. పూర్తి వివరాలు
- Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
ఖాతాదారుడి పోరాటం..
డబ్బులు పోయిన వెంటనే ప్రదోష్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే అదే రోజు ఎస్బీఐ హెల్ప్లైన్ , ఈమెయిల్ ద్వారా బ్యాంకుకు సమాచారం అందించారు. బ్యాంకు స్పందించి మొదట కట్ అయిన రూ. 25,000 తిరిగి ఇచ్చింది కానీ.. పెద్ద మొత్తమైన రూ. 1.99 లక్షలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఖాతాదారుడి తప్పిదం వల్లే డబ్బులు పోయాయని వాదించింది.
కోర్టు తీర్పు..
ఈ కేసు జాతీయ వినియోగదారుల కమిషన్ (NCDRC) వద్దకు చేరింది. విచారణ జరిపిన కోర్టు బ్యాంకు వాదనను తోసిపుచ్చింది. మోసం జరిగిన వెంటనే (మూడు రోజులలోపు) బ్యాంకుకు సమాచారం ఇస్తే.. ఆ నష్టానికి ఖాతాదారుడు బాధ్యుడు కాదని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయని కోర్టు గుర్తు చేసింది. కేవలం ఒక యాప్ డౌన్లోడ్ చేసినంత మాత్రాన అది ఖాతాదారుడి నిర్లక్ష్యం కాదని స్పష్టం చేసింది. బాధితుడికి పోయిన రూ. 1.99 లక్షలతో పాటు, అదనంగా రూ. 25,000 పరిహారం చెల్లించాలని ఎస్బీఐని ఆదేశించింది. నాలుగు వారాల్లోపు ఈ డబ్బులు చెల్లించకపోతే.. 8 శాతం వడ్డీ కూడా కట్టాలని కోర్టు స్పష్టం చేసింది. ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండటంతో పాటు, మోసం జరిగితే వెంటనే స్పందిస్తే న్యాయం జరుగుతుందని ఈ తీర్పు నిరూపించింది.
తాజావార్తలు
-
Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
-
New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
-
KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
-
TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
-
Fire Accident: ఆటోనగర్లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!