Telangana: వరంగల్లో వీరంగం సృష్టించిన సైకో..ఇంట్లో చొరబడి రాళ్లతో దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఈ మధ్య సైకోలు ఎక్కువ అవుతున్నారు.. అసలు ఎక్కడినించి వస్తున్నారో కూడా తెలియకుండా కనిపించిన వారిపై దాడికి తెగబడుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా తెలంగాణలో మరో సైకో వీరంగం సృష్టించాడు.. కనిపించిన వారిని ఇష్టానూసారంగ కొట్టి గాయపరిచాడు.. ఈ ఘటన వరంగల్ లో వెలుగుచూసింది..
ఈ విచిత్ర సైకో సంఘటన పుప్పాలగుట్ట ప్రాంతంలో జరిగింది. అతను ఎవరో అక్కడివారికి తెలియదు. కానీ అతడు నేరుగా ఓ ఇంట్లోకి చొరబడ్డాడు.. ఇంట్లో ఉన్నవారిపై రాయితో దాడి చేశాడు. దీంతో వారి అరుపులు విన్న స్థానికులు హడలెత్తిపోయారు. ధైర్యం చేసి అతన్ని పట్టుకొని చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి రెండు సంచులు చేత పట్టుకొని ఇంట్లోకి ప్రవేశించాడు. ఎవరు మీరని ప్రశ్నించడంతో అతడు ఆగ్రహం తో ఇంటి యాజమానిపై రాయితో దాడి చేశాడు. ఇంట్లో వారి అరుపులు విని ఇరుగు పొరుగు వారంతా అక్కడి చేరుకున్నారు. ఎవరు నువ్వని నిలదీయడం తో ఆసీఫ్ అనే మరోవ్యక్తిపై ఆ సైకో దాడికి పాల్పడ్డాడు.. అతను కూడా తీవ్రంగా గాయపడ్డారు..
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
ఇక అందరు దైర్యం చేసి గ్రామస్తులు అతన్ని అతి కష్టం మీద పట్టుకున్నారు.. అతని మానసిక స్తితి సరిగా లేదనని స్థానికులు గుర్తించారు. చివరికి అతడ్ని పట్టుకుని ఓ స్తంభానికి కట్టేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాని కి వచ్చిన అతడ్ని తీసుకెళ్లారు. అయితే దాదాపు రెండు గంటల పాటు ఆ సైకో సృష్టించిన వీరంగంతో జనాలు భయంతో వణికిపోయారు.. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు.. పోలీసులు ప్రస్తుతం అతన్ని మానసిక వైద్యుల దగ్గర కు తీసుకెళ్లినట్లు తెలుస్తుంది.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!