Telangana : మహబూబాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..15 వేల క్వింటాళ్ల ధాన్యం బుగ్గిపాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణాలో మరో అగ్ని ప్రమాదం జరిగింది.. రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ఓ రైస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ జరకపోయినా భారీ స్థాయిలో ఆస్తి నష్ట జరిగింది.. ఈ ప్రమాదం వల్ల రూ. 2 కోట్ల మేర ఆస్తి నష్టం, అలాగే 15 వేల క్వింటాళ్ల ధాన్యం, 5 వేల క్వింటాళ్ల బియ్యంజరిగినట్లు పోలీసుల వెల్లడించారు…
Read Also:Kajala Agarwal: సినిమాలకు గుడ్ బై.. అదే రీజనా?
వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ లోని జిల్లాలోని కేసముద్రం మండలం భూక్యారాంతండా గ్రామంలోని మహాదేవ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఉన్న ఓ రైస్ మిల్లు కొనసాగుతోంది. అందులో శనివారం తెల్లవారుజామున ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఇక్కడ పని చేసే సిబ్బంది ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం వరకు ఉండి, తరువాత ఇంటికి వెళ్లిపోయారు.. ఆ తర్వాత శనివారం ఉదయం 4 గంటలకు కూలీలు అక్కడకు చేరుకున్నారు.. అయితే ఐదు గంటల సమయంలో లోపలి నుంచి పొగరావడం వెంటనే మంటలు వ్యాపించడంతో వెంటనే రైస్ మిల్ ఓనర్ కు, ఫైర్ డిపార్ట్ మెంట్ కు సమాచారం అందించారు.. ఈ ఘటనా స్థలాన్ని అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, సీఐతో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్నారు.. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు..
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
Read Also:Bihar : వామ్మో.. ప్రియుడి మార్మాంగాన్ని కోసిన ప్రియురాలు.. దారుణం..
దీంతో సమీప జిల్లాల్లో ఉన్న ఫైర్ ఇంజన్లు అన్ని వెంటనే అక్కడకు చేరుకున్నాయి.. మిల్లు వెనక ఉన్న ఓ గోడను సిబ్బంది తొలగించారు. దాని ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే భారీ నష్టం జరిగింది. 15 వేల క్వింటాళ్ల ధాన్యం, 5 వేల క్వింటాళ్ల బియ్యం మంటల్లో కాలి బూడిద అయ్యాయని సమాచారం.. ఇక రూ.2 కోట్ల విలువైన మిషిన్లు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కాలిపోయిన తరువాత మిగిలిన ధాన్యాన్ని స్థానికంగా ఉన్న మరో రైస్ మిల్ కు తీసుకెళ్లారు.. మంటలని అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది చాలా కష్ట పడ్డారు.. ఇలా తెలంగాణ లో వరుస అగ్ని ప్రమాధాలకు కారణం తెలపాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!