మహిళల కోసం, అమ్మాయిల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలను అమలు చేస్తున్నా కూడా అమ్మాయిల పై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా తెలంగాణ లో దారుణ ఘటన వెలుగు చూసింది.. తాజాగా కరీంనగర్ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికను ఓ ప్రేమ పేరుతో నమ్మించి తన కామవాంఛ తీర్చుకోగా.. ఆ దారుణానికి సంబంధించిన ఫోటోలను అడ్డుపెట్టుకుని అతని స్నేహితులు ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేసి.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్ టౌన్ లో ఆలస్యంగా వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే..కరీంనగర్ పట్టణంలోని ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. ఆ బాలిక నివసిస్తున్న ప్రాంతంలో ఉండే ఇంటర్ చదివే బాలుడుతో పరిచయం ఏర్పడింది. ఆ బాలుడు ప్రేమ పేరుతో ఆ బాలికను నమ్మించాడు. సుమారు ఏడాది కిందట ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తన కామవాంఛ తీర్చుకున్నాడు.. ఆ సమయంలో తన ఫ్రెండ్స్ రహస్యంగా వారిద్దరినీ ఫోన్ లో ఫోటోలు, వీడియోలను తీసారు.. వాటిని అమ్మాయికి చూపిస్తూ పలుమార్లు తన ఫ్రెండ్స్ కూడా అత్యాచారం చేశారు..ఈ విషయం తెలిసిన వారి స్నేహితులైన మరో ముగ్గురు ఆ బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బాలిక దైర్యం చేసి..షీటీమ్ దృష్టికి తీసుకెళ్లింది. తొలుత అఘాయిత్యానికి పాల్పడిన వారిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు..
ఇక ఆ విషయం అమ్మాయి తల్లి దండ్రులకు తెలియడంతో నగరంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఇలా ఫిర్యాదు చేయడంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో బాలిక ప్రేమికుడితో పాటు మరో ఐదుగురిపై పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదైంది. కేసు నమోదైన ఆరుగురిలో అయిదుగురు మైనర్లు కాగా.. ఒకరు మేజర్ అని పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపారు.. వారందరిని ఉరి తీయాలని బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ విషయం అందరికి తెలియడం తో స్థానికంగా రసభాసగా మారింది.. ఈ కేసు పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి..