Telangana : కరీంనగర్ లో దారుణం..బాలికపై సామూహిక అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల కోసం, అమ్మాయిల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలను అమలు చేస్తున్నా కూడా అమ్మాయిల పై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా తెలంగాణ లో దారుణ ఘటన వెలుగు చూసింది.. తాజాగా కరీంనగర్ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికను ఓ ప్రేమ పేరుతో నమ్మించి తన కామవాంఛ తీర్చుకోగా.. ఆ దారుణానికి సంబంధించిన ఫోటోలను అడ్డుపెట్టుకుని అతని స్నేహితులు ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేసి.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్ టౌన్ లో ఆలస్యంగా వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే..కరీంనగర్ పట్టణంలోని ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. ఆ బాలిక నివసిస్తున్న ప్రాంతంలో ఉండే ఇంటర్ చదివే బాలుడుతో పరిచయం ఏర్పడింది. ఆ బాలుడు ప్రేమ పేరుతో ఆ బాలికను నమ్మించాడు. సుమారు ఏడాది కిందట ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తన కామవాంఛ తీర్చుకున్నాడు.. ఆ సమయంలో తన ఫ్రెండ్స్ రహస్యంగా వారిద్దరినీ ఫోన్ లో ఫోటోలు, వీడియోలను తీసారు.. వాటిని అమ్మాయికి చూపిస్తూ పలుమార్లు తన ఫ్రెండ్స్ కూడా అత్యాచారం చేశారు..ఈ విషయం తెలిసిన వారి స్నేహితులైన మరో ముగ్గురు ఆ బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బాలిక దైర్యం చేసి..షీటీమ్ దృష్టికి తీసుకెళ్లింది. తొలుత అఘాయిత్యానికి పాల్పడిన వారిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు..
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
ఇక ఆ విషయం అమ్మాయి తల్లి దండ్రులకు తెలియడంతో నగరంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఇలా ఫిర్యాదు చేయడంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో బాలిక ప్రేమికుడితో పాటు మరో ఐదుగురిపై పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదైంది. కేసు నమోదైన ఆరుగురిలో అయిదుగురు మైనర్లు కాగా.. ఒకరు మేజర్ అని పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపారు.. వారందరిని ఉరి తీయాలని బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ విషయం అందరికి తెలియడం తో స్థానికంగా రసభాసగా మారింది.. ఈ కేసు పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!