Thanjavur Horror: అసలు వీడు కన్నతండ్రేనా.. భార్య మీద కోపంతో ఏం చేశాడంటే..
- భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి...
- భార్య మీద కోపంతో పిల్లలను హత్య చేసిన భర్త
- తంజావూర్ సంచలనం సృష్టించిన ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి తీవ్ర మనో వేధనకు గురయ్యాడు. భార్య మీద కోపంతో తన ముగ్గురు పిల్లలను దారుణాతి దారుణంగా హత్య చేసి… పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూర్ లో జరిగింది.
Read Also: Uncles Murder Nephew: అల్లుడిని ఛాయ్ కి పిలిచి దారుణం.. ఏమైందంటే..
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
పూర్త వివరాల్లోకి వెళితే.. తంజావూరు జిల్లాలోని పట్టుక్కోట్టై తాలూకా గోపాలసముద్రం గ్రామానికి చెందిన నిందితుడు ఎస్ వినోద్ కుమార్ మదుక్కూర్ సమీపంలోని ఒక హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య నిత్య (35) దంపతులకు కుమార్తెలు వి ఓవియా (12), వి కీర్తి (8), కుమారుడు వి ఈశ్వరన్ (5) ఉన్నారు. అయితే తన భార్య వేరే ఒక వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది భరించలేని భర్త వినోద్ ఆ కోపాన్ని తన పిల్లలపై చూపించాడు. ముగ్గురు బిడ్డలను అత్యంత పాశవికంగా హతమార్చాడు. తంజావూరులో ఒక తండ్రి తన ముగ్గురు పిల్లలను నరికి చంపాడని పోలీసులు తెలిపారు. తన భార్య మరొక వ్యక్తితో ఉన్న సంబంధంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు పిల్లల హత్య తంజావూరు ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
Read Also:Wife give poison to husband: ఉదయమంతా భర్త కోసం ఉపవాసం.. సాయంత్రం కాగానే..
నిత్య సోషల్ మీడియా ద్వారా మన్నార్గుడికి చెందిన ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. ఆరు నెలల క్రితం తన భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో.. ఆమె తన భర్త, పిల్లలను వదిలి ఆ వ్యక్తితో పారిపోయింది. దీంతో వినోద్ కుమార్ షాక్ కు గురయ్యాడని పోలీసులు తెలిపారు. అయితే, అతను ఆమెను మర్చిపోలేకపోయాడు. కొన్ని రోజుల క్రితం ఆమెను కలిసి.. తనతో ఇంటికి రావాలని చెప్పడంతో ఆమె ఒప్పుకోలేదు.. దీంతో మద్యానికి బానిసైన వినోద్ ముగ్గురు పిల్లలను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!