Tamil Nadu: తమిళనాడులో షాకింగ్ సంఘటన జరిగింది. కోయంబత్తూర్ జిల్లాలో 13 ఏళ్ల బాలుడిని, అతడి ఇద్దరు మైనర్ స్నేహితులు హత్య చేసి పాతిపెట్టారు. బాధితుడు జిల్లాలోని ఇరుగూర్ ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. శనివారం మృతి చెందిన బాలుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి నిర్మానుష్యంగా ఉన్న ఒక కాలువ వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లారు. ముగ్గురు కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత వీరి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మరణించిన బాలుడు మద్యం మత్తులో ముందుగా మరొక బాలుడిపై సీసాతో దాడి చేయడంతో గొడవ హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలో ఇద్దరు బాలుడు ఎదురుదాడి చేసి హత్య చేసినట్లు తెలిసింది. బాలుడు మరణించడంతో భయపడిన ఇద్దరు బాలురు పోలీసులు అరెస్ట్ చేస్తారని, మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టి ఇంటికి వెళ్లారు.
బాధితుడి తండ్రి తన కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇద్దరు బాలురను ప్రశ్నించడంతో ఆదివారం రాత్రి తాము చేసిన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపించారు. మైనర్లను అబ్జర్వేషన్ హోమ్కు పంపించనున్నారు.
ఈ ఘటన తమిళనాడులో సంచలనంగా మారింది. మృతుడు, చంపినవాళ్లు అంతా మైనర్లు కావడంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. వెన్నులో వణుకు పుట్టించేదిగా అభివర్ణించారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని సరైన దిశలో మార్గనిర్దేశం చేయాలని ఆయన కోరారు.
