NTV Telugu Site icon

UP video: యూపీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి.. నిందితుడి కాలుకు బుల్లెట్

Upfire

Upfire

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో దారుణం జరిగింది. మహిళా లా విద్యార్థినిపై మగ లా విద్యార్థి బురఖాలో యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 36 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో చిక్కాయి.

ఇది కూడా చదవండి: Tata Group Chairman Meet AP CM: రేపు సీఎం చంద్రబాబుతో టాటా గ్రూపు ఛైర్మన్ భేటీ..!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు సీనియర్ న్యాయవాది దగ్గర న్యాయశాస్త్రం నేర్చుకుంటుంది. అక్కడ జూనియర్ లాయర్ అయిన అతుల్‌తో స్నేహం ఉండేది. అయితే వారి మధ్య సంభాషణ తగ్గిపోయింది. అతుల్‌కు అప్పుగా ఇచ్చిన రూ.8 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో అతుల్ కలత చెందాడు. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని యాసిడ్ దాడికి ప్లాన్ చేశాడు. అతుల్ తేలికపాటి యాసిడ్‌ను ఉపయోగించాలని జాగ్రత్తగా పడ్డాడు. బాధితురాలు కోర్టులో పని ముగించుకుని ఇంటికి వస్తుండగా బురఖా ధరించిన అతుల్ ఆమెను వెంబడించి యాసిడ్ పోశాడు. దాడి తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితుడిని గుర్తించడానికి SOG, నిఘా మరియు సైబర్ విభాగాలతో సహా ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నేరం జరిగిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెట్రోల్ పంపు సమీపంలో ఇద్దరు వ్యక్తులు, ఒకరు బురఖా ధరించి బైక్‌పై వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించడంతో పురోగతి కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతుల్‌ను గుర్తించారు. అతుల్‌ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. దీంతో అతుల్ కాలులోకి బుల్లెట్ దిగింది. అరెస్ట్ చేసి చికిత్స కోసం అతుల్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Health: టీ తయారు చేసేటప్పుడు ఇలా చేస్తున్నారా.. ప్రమాదంలో పడ్డట్టే..!