Ujjain Rape Case: “నా కొడుకును ఉరేసి చంపండి”.. ఉజ్జయిని రేప్ కేసు నిందితుడి తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ujjain Rape Case: ఉజ్జయిని అత్యాచార ఘటన దేశాన్ని షాక్కి గురిచేసింది. ఓ 12 ఏళ్ల బాలిక దారుణంగా అత్యాచారానికి గురై తీవ్రవేదనతో అర్దనగ్నంగా ప్రతీ ఇంటి ముందు వెళ్లి సాయం అడిగిన వీడియో యావత్ దేశాన్ని కుదిపేసింది. ఓ దిక్కు రక్తం కారుతున్నా, 8 కిలోమీటర్లు నడిచి సాయం కోరితే, కొందరు ఇంటి ముందు నుంచి తరిమికొట్టడం అక్కడ సీసీటీవీల్లో రికార్డైంది. చివరకు ఓ గుడి పూజారి బాలికను పరిస్థితిని గుర్తించి కొత్త బట్టలు ఇచ్చి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సర్కార్ సిట్ ని ఏర్పాటు చేసింది. ఘటన జరిగిన వెంటనే ప్రధాన నిందితుడైన ఆటోడ్రైవర్ భరత్ సోనిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ‘‘నా కొడుకును ఉరేసి చంపండి’’ అని నిందితుడు భరత్ సోని తండ్రి డిమాండ్ చేశారు. బాధిత బాలిక కూడా తన కూతురు లాంటిదే అని ఆయన అన్నారు. ఈ కేసులో నిందితుడి పక్షాలన ఎవరూ వాదించవద్దని స్థానిక బార్ అసోసియేషన్ కోరింది.
Also Read
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
Read Also: Jaishankar: మేమేం తలుపులు మూసుకుని కూర్చోలేదు.. ఆధారాలుంటే ఇవ్వండి.. కెనడాకు స్ట్రాంగ్ మెసేజ్..
ఇది సిగ్గుమాలిన చర్యల, నేను నా కొడుకును కలిసేందుకు ఆస్పత్రికి వెళ్లలేదు, పోలీస్ స్టేషన్, కోర్టుకు కూడా వెళ్లను, నా కొడుకు నేరం చేశాడు కాబట్టి అతన్ని ఉరితీయాలి అని నిందితుడి తండ్రి అన్నారు. ఈ ఘటన పవిత్ర ఉజ్జయిని ప్రాంత ప్రతిష్టను దెబ్బతీసిందని బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అశోక్ యాదవ్ అన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడి భరత్ సోనితో పాటు మరో ఇద్దర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు పట్టుకున్నారు. బాధిత బాలిక ప్రస్తుతం ఇండోర్ లోని ప్రభుత్వ మహారాజా తుకోజీరావు హోల్కర్ మహిళా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రధాని మోడీ, హోమంత్రి అమిత్ షా మౌనంగా ఉన్నారని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మహిళలు కావడం పాపంగా మారిందని, మైనర్ల అత్యాచార కేసుల్లో మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని, 18 ఏళ్ల పాలనలో 58 వేల రేప్ కేసులు నమోదయ్యాయని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!