Serial killer: డ్రైవర్లను టార్గెట్ చేస్తూ చంపే సీరియల్ కిల్లర్.. 24 ఏళ్ల తర్వాత అరెస్ట్..
- క్యాబ్ డ్రైవర్ల టార్గెట్గా హత్యలు..
- 24 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ సీరియల్ కిల్లర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Serial killer: 24 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ‘‘సీరియల్ కిల్లర్’’ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కిల్లర్ అజయ్ లాంబాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. క్యాబ్ డ్రైవర్లను టార్గెట్ చేస్తూ చంపే లాంబా, ఢిల్లీ, ఉత్తరాకండ్ అంతటా అనేక మర్డర్లకు పాల్పడే ముఠాను నడించాడనే ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Lucky Bhasker : లక్కీ భాస్కర్ కు సీక్వెల్ చేస్తా.. వెంకీ అట్లూరి క్లారిటీ
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
లాంబా, అతడి ముగ్గురు సహచరులు కస్టమర్లుగా నటిస్తూ టాక్సీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసేవారు. రైడ్ బుక్ చేసుకున్న తర్వాత, ఈ ముఠా డ్రైవర్లను ఉత్తరాఖండ్ కొండల్లోని మారుమూల ప్రాంతాలకు రప్పించేంది. ఈ ముఠా డ్రైవర్లపై స్పృహ కోల్పోయేలా చేసి, గొంతు కోసి చంపి, లోతైన లోయలో మృతదేహాన్ని పారేసేది. దొంగలించిన వాహనాలను నేపాల్ కు అక్రమంగా తరలించి విక్రయించేవారు.
అధికారులు ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కనీసం ముగ్గురు బాధితుల అవశేషాలు ఇంకా లభించలేదు. కొన్ని ఏళ్లుగా అనేక మంది క్యాబ్ డ్రైవర్ల అదృశ్యం వెనక ఈ ముఠా హస్తం ఉండవచ్చని అధికారులు భయపడుతున్నారు. గత 10 ఏళ్లుగా లాంబా నేపాల్లో దాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. లాంబాకు హత్యలతో పాటు ఢిల్లీ, ఒడిశాలో డ్రగ్స్ అక్రమ రవాణా, దోపిడీ చేసిన రికార్డు కూడా ఉంది. 2001 నుంచి నేర కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అతని సహచరులలో ఒకరైన ధీరేంద్ర దిలీప్ పాండేను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు, మరో ముఠా సభ్యుడు ధీరజ్ పరారీలో ఉన్నాడు. దర్యాప్తు కొనసాగుతోంది. అజయ్ లాంబా నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!