పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అమీర్ పేట బొంగుల బస్తీలోని ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫల యత్నం జరిగింది. ఏటీఎం వద్ద ఉన్న సీసీ కెమెరా ను ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన ఆగంతకుడు..డబ్బులు చోరీ చేసేందుకు యత్నించాడు.
సీసీ కెమేరాతో పాటు ఏటీఎం కు ఏర్పాటు చేసిన కీబోర్డ్ ను ధ్వంసం చేశాడు. ముంబై లోని బ్యాంకు చెందిన కంట్రోల్ రూమ్ లో సిగ్నల్ రావడంతో స్థానిక ఏటీఎం శుభ్రపరిచే చంద్రశేఖర్ ను అప్రమత్తం చేశారు. చంద్రశేఖర్ వెళ్లి చూసేసరికి ఏటీఎం పాక్షికంగా దెబ్బతిని ఉంది. దీంతో హౌస్ కీపింగ్ చేసే చంద్రశేఖర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.