హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. చైన్ స్నాచర్లు గొలుసులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఎల్బీనగర్ సంతోషి మాత దేవాలయంలో జరిగిన చోరీ కేసును ఛేదించామన్నారు రాచకొండ కమిషనర్ మహేష్ భగత్. డిసెంబర్ 3, 4 తేదీలలో దేవాలయంలో అమ్మవారి నగలు చోరీ గురయ్యాయని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టాం. సీసీటీవీ కెమేరాలతో పాటు దర్యాప్తు చేపట్టాం అన్నారు. ఇది అంతరాష్ట్ర దొంగల పని అని గుర్తించామన్నారు.
ఐటి , సైబర్ క్రైమ్, స్పెషల్ టీమ్స్ తో గాలింపు చేపట్టాం. అంతరాష్ట్ర దొంగల ముఠా గ్యాంగ్ 5 సభ్యులను గుర్తించాం. ఇందులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసాము. ఈ గ్యాంగ్ లో గుంటూరు జిల్లా కు చెందిన పొన్నూరి చిన్న సత్యానంద్ అలియాస్ సతీష్. మాండ్ల నాగేందర్ మరో నిందితుడు పరారీలో ఉన్నారని మహేష్ భగత్ తెలిపారు.
మొత్తం 19 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నాం.నిందితుల నుండి 215 గ్రాముల బంగారం, ఒక కారు, ఒక బుల్లెట్ వాహనం.నిందితుల పై రెండు తెలుగు రాష్ట్రాల 10 కేసులు నమోదు అయ్యాయి.గతంలో నాలుగు దేవాలయాల్లో చోరీలు చేశారు. నిందితులు దేవలయాలతో పాటు హౌస్ బ్రోకింగ్, ఆటో మొబైల్స్ కేసులు కూడా ఉన్నాయని రాచకొండ సీపీ తెలిపారు.