Unemployment: షాకింగ్.. నిరుద్యోగంతో 25 వేల మంది ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కో ఏడాది లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ పట్టాలు అందుకుంటున్నారు.. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. కొందరు తగిన ఉద్యోగం దొరకపోయినా.. ఎక్కడో తోచిన పని చేసుకుంటున్నారు.. కొందరికి అది కూడా సాధ్యం కావడం లేదు.. ఇక, నిరుద్యోగం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి అన్ని పార్టీలు.. మేం అధికారంలోకి వస్తే.. లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తామిని హామీలు ఇవ్వడం మామూలే.. కానీ, వాళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్గా ఉంటుంది.. ఇక, ఉన్నత చదువులు చదినా ఉద్యోగం రాలేదన్న బాధతో కొందరు.. నిరుద్యోగం కారణంగా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను.. పైగానే నేనే వారికి భారంగా మారిపోయానని మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు.. మూడేళ్లలో 2018 నుంచి 2020 వరకు దేశవ్యాప్తంగా ఏ కంగా 25,000 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.
Read Also: Bharti Airtel: వినియోగదారులకు మరో షాక్..!
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
రాజ్యసభలో ఈ అంశంపై ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) అందించిన డేటా ఆధారంగా ప్రభుత్వ గణాంకాలు ఉన్నాయన్న ఆయన.. మూడేళ్లలో (2018-2020) దేశంలో నిరుద్యోగం కారణంగా 25,000 మంది ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. ఇందులో ఉద్యోగం రాలేదని 9,140 మంది ఆత్మహత్య చేసుకోగా.. 16,091 మంది నిరుద్యోగం వల్ల తలెత్తిన ఆర్థిక సమస్యలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.. కాగా, గత కొన్ని వారాలుగా నిరుద్యోగ సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంచి రోజులు అంతంతమాత్రంగా ఉన్నాయని చెప్పడానికి ఒక సర్వేను కూడా ఉదహరించారు.. డేటా ప్రకారం 2020లో నిరుద్యోగులలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.. అత్యధికంగా 3,548 మంది ఒకే ఏడాది ప్రాణాలు తీసుకున్నారు.. ఇక, 2018లో 2,741 మంది నిరుద్యోగం కారణంగా జీవితాన్ని ముగించగా, 2019లో 2,851 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.. 2018లో 4,970 మంది దివాలా తీయడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని, 2019లో ఆ సంఖ్య 5,908కి పెరిగిందని, 2020లో 600 మరణాలు తగ్గి 5,213కి చేరుకున్నాయని వెల్లడించారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్.. ఇక, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించి ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం చూస్తోందన్న ఆయన.. మానసిక రుగ్మతల భారాన్ని పరిష్కరించడానికి, ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని (NMHP) అమలు చేస్తోందన్నారు..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!