Unemployment: షాకింగ్.. నిరుద్యోగంతో 25 వేల మంది ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కో ఏడాది లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ పట్టాలు అందుకుంటున్నారు.. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. కొందరు తగిన ఉద్యోగం దొరకపోయినా.. ఎక్కడో తోచిన పని చేసుకుంటున్నారు.. కొందరికి అది కూడా సాధ్యం కావడం లేదు.. ఇక, నిరుద్యోగం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి అన్ని పార్టీలు.. మేం అధికారంలోకి వస్తే.. లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తామిని హామీలు ఇవ్వడం మామూలే.. కానీ, వాళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్గా ఉంటుంది.. ఇక, ఉన్నత చదువులు చదినా ఉద్యోగం రాలేదన్న బాధతో కొందరు.. నిరుద్యోగం కారణంగా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను.. పైగానే నేనే వారికి భారంగా మారిపోయానని మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు.. మూడేళ్లలో 2018 నుంచి 2020 వరకు దేశవ్యాప్తంగా ఏ కంగా 25,000 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.
Read Also: Bharti Airtel: వినియోగదారులకు మరో షాక్..!
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
రాజ్యసభలో ఈ అంశంపై ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) అందించిన డేటా ఆధారంగా ప్రభుత్వ గణాంకాలు ఉన్నాయన్న ఆయన.. మూడేళ్లలో (2018-2020) దేశంలో నిరుద్యోగం కారణంగా 25,000 మంది ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. ఇందులో ఉద్యోగం రాలేదని 9,140 మంది ఆత్మహత్య చేసుకోగా.. 16,091 మంది నిరుద్యోగం వల్ల తలెత్తిన ఆర్థిక సమస్యలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.. కాగా, గత కొన్ని వారాలుగా నిరుద్యోగ సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంచి రోజులు అంతంతమాత్రంగా ఉన్నాయని చెప్పడానికి ఒక సర్వేను కూడా ఉదహరించారు.. డేటా ప్రకారం 2020లో నిరుద్యోగులలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.. అత్యధికంగా 3,548 మంది ఒకే ఏడాది ప్రాణాలు తీసుకున్నారు.. ఇక, 2018లో 2,741 మంది నిరుద్యోగం కారణంగా జీవితాన్ని ముగించగా, 2019లో 2,851 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.. 2018లో 4,970 మంది దివాలా తీయడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని, 2019లో ఆ సంఖ్య 5,908కి పెరిగిందని, 2020లో 600 మరణాలు తగ్గి 5,213కి చేరుకున్నాయని వెల్లడించారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్.. ఇక, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించి ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం చూస్తోందన్న ఆయన.. మానసిక రుగ్మతల భారాన్ని పరిష్కరించడానికి, ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని (NMHP) అమలు చేస్తోందన్నారు..
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..