Nandu World: వాళ్లిద్దరూ యూట్యూబ్లో ఫేమస్.. చేసేది మాత్రం..!
- వీసా పేరిట ప్రముఖ యూట్యూబర్స్ స్కామ్
- రూ. 15 లక్షలు తీసుకుని ముఖం చాటేసిన యూట్యూబర్స్
- ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ యూట్యూబర్స్ మధుకర్, ఆయన భార్య రమా నందనపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. వీళ్లిద్దరూ నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్లో ఫేమస్ అయ్యారు. వాళ్లు వీసా పేరిట డబ్బు తీసుకుని మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతే బాధితుడు చేసిన ఆరోపణలను రమా నందన ఖండించారు.
కపుల్స్ పేరు జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమా నందన. ఇలా చెబితే ఎవరైనా పెద్దగా గుర్తించరు. కానీ యూట్యూబ్లో నందూస్ వరల్డ్ పేరు చెబితే.. వీళ్లని ఇట్టే గుర్తు పట్టేస్తారు. యూట్యూబ్లో చాలా ఫేమ్ అయన వీరిద్దరి మీద ఇప్పుడు వీసా రిన్యువల్ పేరిట మోసం చేశారంటూ కేసు నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్.. తనను మోసం చేశారంటూ కేసు పెట్టారు.
Also Read
యూకేలో వీసా గడువు ముగియడంతో.. శివక్రాంతి కుమార్.. దాన్ని రిన్యువల్ చేయించుకునేందుకు డెస్టినీ కన్సల్టెన్సీకి వెళ్లారు. ఈ కన్సల్టెన్సీకి డైరెక్టర్స్గా జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమా నందన ఉన్నారు. వాళ్లిద్దరూ యూట్యూబ్లో ఫేమ్లో ఉండడంతో వారి మాటలు నమ్మి.. వీసా రిన్యువల్ కోసం క్రాంతి కుమార్ దాదాపు రూ. 15 లక్షలు చెల్లించాడు. ఐతే నెలలు గడిచినా వీసా ప్రాసెస్ కాకపోవడం.. డబ్బుల గురించి సరైన సమాధానం చెప్పకపోవడంతో బాధితుడు తాను మోసపోయినట్లు గ్రహించారు. భారత్లో ఉన్న డెస్టినీ కన్సల్టెన్సీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమా నందన, గుంటూరులో నివసించే మధుకర్ తండ్రిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు దర్యాప్తు జరుగుతోందని ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు.
నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేస్తూ లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించిన నందన, ఆమె భర్త మధుకర్, పిల్లలతో కలిసి సరదా వీడియోలు చేస్తూ జనాన్ని ఎంటర్టైన్ చేసేవారు. ఒకానొక దశలో తినడానికి తిండిలేక పస్తులున్నామని, మగ గొంతు కారణంగా పలు అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ వీడియోలు చేస్తూ వచ్చారు. ఆ వీడియోలు ప్రేక్షకాదరణ పొందాయి. యూట్యూబ్ ఆదాయంతో పాటు సినీమా అవకాశాలు కూడా దక్కాయి. నందన తన తొలి సినిమా మన శంకర వర ప్రసాద్లో హీరోయిన్ నయనతార స్నేహితురాలు పాత్రలో కనిపించారు. ఒక్క సన్నివేశమే అయినా ఆమెకు గుర్తింపు వచ్చింది.
తాజాగా తనపై వస్తున్న ఆరోపణలను నందన ఖండించారు. ప్రజల్లో, సోషల్ మీడియాలో తమకు వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేక పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె వీడియో విడుదల చేశారు. యూకే నుంచి భారత్కు వచ్చిన కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.
తాజావార్తలు
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!