Madhya Pradesh: భర్తతో గొడవ.. 2 ఏళ్ల కుమార్తెని నీటిలో ముంచి చంపిన తల్లి..
- భార్యభర్తల మధ్య గొడవ..
- 2 ఏళ్ల కుమార్తెని చంపేసిన తల్లి..
Madhya Pradesh: భార్యభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలు తీవ్ర వివాదాలకు కారణమవుతున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తు్న్నాయి. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు, హత్యలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ సియోనిలో భర్తతో గొడవపడిన భార్య, తన రెండేళ్ల కుమార్తెను హత్య చేసి, తాను కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
Read Also: AP Police: స్టేజ్పై కోడి తల కొరికి చంపిన డ్యాన్సర్.. కేసు నమోదు
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
మొదట పసిపాపని నీటి తొట్టిలో ముంచి, ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా చనిపోవాలనే ఉద్దేశ్యంతో బావిలోకి దూకింది. చివరకు భర్త ఆమెను రక్షించాడు. సియోనిలోని చమరి తోలా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. భార్యభర్తల గొడవ జరిగిన తర్వాత ఆమె కూతురు ఖుషీని వాటర్ ట్యాంక్లో ముంచి చంపింది. ఆపై భార్య బావితో దూకగా, ఇది చూసిన భర్త విషతు లాల్ అహిర్వార్ ఆమెను రక్షించాడు. దురదృష్టవశాత్తు కూతురుని రక్షించలేకపోయాడు.
ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. నిందితురాలైన తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. మహిళకు 2021లో అహిర్వార్తో వివాహం జరిగింది. స్థానికంగా ఈ ఘటన ప్రజల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది.
తాజావార్తలు
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో