వారం రోజుల పసికందును అంత దారుణంగా ఎలా చేయగలిగావ్ తల్లీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజం మారుతోంది.. మహిళపై వివక్ష తగ్గుతోంది.. ఆడామగ ఇద్దరు సమానమే అనుకుంటున్నారు తల్లిదండ్రులు.. ఇక సమాజంలో స్త్రీల సంఖ్య పెరుగుతోంది అని ఆశించేలోపు ఎక్కడో ఒకచోట ఈ వివక్ష కనిపించడం బాధాకరమైన విషయం.. ఆడపిల్ల కడుపులో పెరుగుతోందని కడుపులోనే చంపేస్తున్నారు.. ఆడపిల్లలు పుట్టారని.. పుట్టినా వెంటనే గొంతు నులిమేస్తున్నారు.. తాజాగా ఒక తల్లి తనకు వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో.. మూడో బిడ్డను అతి కిరాతకంగా చంపిన దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. తాడికొండ మండలం రావెలకు చెందిన బొంతా లక్ష్మి కి కొన్నేళ్ల క్రితం వివాహమైంది.. ఆమెకు ఇద్దరు కుమార్తెలు.. ఈసారి ఎలాగైనా మగబిడ్డకు జన్మనివ్వాలని మూడో కాన్పు కోసం గుంటూరు జీజీహెచ్ లో జాయిన్ అయ్యింది. డిసెంబర్ 2 న ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో రెండు రోజులకే ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే లక్ష్మీ మాత్రం ఆనందంగా లేదు.. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు.. మగబిడ్డకు ఎదురుచూస్తే మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టింది.. ఎందుకు ఈ ఆడ సంతానం అని కోపంతో రగిలిపోయి.. వారం రోజుల పసికందు అని కూడా చూడకుండా పసిగుడ్డు నోట్లో వేళ్లు పెట్టి ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపేసింది. ఆ తరువాత ఏమి తెలియనట్లు బిడ్డ చనిపోయిందని తెలిపింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ విషయం తెలుసుకున్న ఏఎన్ఏం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి లక్ష్మీని అరెస్ట్ చేశారు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!