కామాంధులకు వయస్సుతో సంబంధం లేదు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఆడవారిపై విరుచుకుపడుతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు కామాంధుల చేతులలో నలిగిపోతున్నారు. ఇందులో మైనర్ బాలురు ఉండడం గమనార్హం. ఇద్దరు బాలురు తమ ఇంటిపక్కన ఉండే మరో ఇద్దరు బాలికలను ఆడుకుందామని పిలిచి వారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిలాల్లో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే సుజాతనగర్లో నివాసముంటున్న ఇద్దరు బాలికలు 3వ తరగతి, 5వ తరగతి చదువుతున్నారు. వారు రోజు సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ ఉంటారు. ఎప్పటిలానే శుక్రవారం సాయంత్రం కూడా బాలికలు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు వారిని ఆడుకొందాం రండి అని చెప్పడంతో వారితో పాటు వెళ్లారు. బాలికలను తీసుకెళ్లిన బాలురు ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అటుగా వెళ్తున్న మరో వ్యక్తి చూసి అరవడంతో బాలురు పారిపోయారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు బాలురును అరెస్ట్ చేశారు.