West Bengal: బెంగాల్లో మరో వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. క్యాంపస్ సమీపంలోనే దారుణం..
- బెంగాల్లో మరో వైద్య విద్యార్థిపై అత్యాచారం..
- క్యాంపస్ సమీపంలోనే దారుణం..
- పానీపూరీ కోసం బయటకు వచ్చిన సమయంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో మహిళలపై వరస అత్యచార సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ పీజీ డాక్టర్పై అత్యాచార ఘటన మరవక ముందే, చాలా మంది మహిళలు రకమైన దారుణాలకు గురయ్యారు. తాజాగా, బెంగాల్లోని దుర్గాపూర్లో ఓ ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఒడిశాలోని జలేశ్వర్ కు చెందిన బాధితురాలు, పశ్చిమ బెంగాల్ లోని అతిపెద్ద పారిశ్రామిక కేంద్రమైన దుర్గాపూర్ లోని శోభాపూర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ డిగ్రీ చదువుతోంది. ఇది రాజధాని కోల్కతా నుంచి 170 కి.మీ దూరంలో ఉంది.
శుక్రవారం రాత్రి 8.30 గంటలకు విద్యార్థిని తన బాయ్ఫ్రెండ్తో కలిసి క్యాంపస్ బయటకు వచ్చింది. క్యాంపస్ గేట్ దగ్గర ఒక వ్యక్తి ఆమెను ఆస్పత్రి వెనక ఉన్న నిర్జన ప్రాంతానికి ఈడ్చుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం, బాధితురాలిని వైద్య పరీక్షల కోసం పంపారు. కాలేజ్ సిబ్బందితో పాటు మహిళతో ఉన్న ఆమె ఫ్రెండ్ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Also Read
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
Read Also: Pakistan: రణరంగంగా పాకిస్తాన్.. ఇజ్రాయిల్ వ్యతిరేక ఆందోళనల్లో 11 మంది మృతి..
ఈ సంఘటన గురించి తన కుమార్తె స్నేహితుడు తనకు తెలియజేశాడని విద్యార్థిని తండ్రి విలేకరులకు తెలిపారు. నేను అక్కడికి చేరుకున్నప్పుడు, నా కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పాడు. ఆస్పత్రి సిబ్బంది నుంచి స్పందన లేదని ఆయన అన్నారు. తన కుమార్తె పానీపూరీ తినడానికి క్యాంపస్ బయటకు వచ్చింది., ఆమె ప్రియుడు వాసిఫ్ అలీ తనను కలవడానికి పిలిచాడని ఆయన చెప్పారు.
ఆమె క్యాంపస్ బయటకు వచ్చిన తర్వాత, బయట నలుగురైదుగురు వ్యక్తులు ఉన్నారని, ఇందులో ఒకడు ఆమెను ఈడ్చుకెళ్లి, అత్యాచారాని పాల్పడినట్లు వెల్లడించారు. ఆమె మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వడానికి రూ. 3000 డిమాండ్ చేశాడని చెప్పాడు. తన కుమార్తెకు న్యాయం జరగాలని, ఇలాంటి సంఘటనలు మరే అమ్మాయికి జరగొద్దని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!