Gujarat: అత్తమామల్ని లేపేసేందుకు ఏకంగా బాంబు తయారీ నేర్చుకున్నాడు..
- భార్యను తన నుంచి విడదీశారనే కోపం..
- అత్తమామల్ని చంపేందుకు ఆన్లైన్లో బాంబుల తయారీ..
- బాంబు పేలడంతో ఇద్దరి గాయాలు..
- నిందితులను అరెస్ట్ చేసిన గుజరాత్ పోలీసులు..
Gujarat: అహ్మదాబాద్లోని ఓ ఇంట్లో డెలివరీ చేసిన పార్సిల్ పేలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనలో నిందితులైన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ కేసులో కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. తన నుంచి భార్యని విడదీసేందుకు కారణమైన ఆమె ఫ్రెండ్ బల్దేవ్ సుఖాడియా, ఆమె తండ్రి, సోదరుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు నిందితుడు రూపన్ రావు(44) ఇంటర్నెట్లో బాంబులు, నాటు తుపాకులను తయారుచేయడం నేర్చుకున్నట్లు తేలింది.
నిందితుల నుంచి మరో రెండు బాంబులు, కంట్రీమేడ్ పిస్టర్, క్యాట్రిడ్జ్లు, ఆయుధాల తయారీలో ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూపన్ రావు భార్య విడాకులు తీసుకుంటోంది. ఈ కేసు విచారణ ప్రస్తుతం కోర్టులో ఉంది. సుఖాడియా తనకు, తన భార్యకు మధ్య విభేదాలు సృష్టించి తనకు, తన పిల్లలకు దూరం చేసిందని రూపర్ రావు నమ్మాడు. తన భార్య, అత్తమామలు, బావమరిది కడుపునొప్పి కారణంగా తాను బలహీనపరిచారని నిందితుడు భావించినట్లు అధికారులు తెలిపారు.
Also Read
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
Read Also: Zia Ur Rehman Barq: విద్యుత్ దొంగతనం.. సమాజ్వాదీ ఎంపీకి చుక్కలు చూపిస్తున్న యోగి సర్కార్..
నిందితుడు సుఖాదియా, అతని అత్తమామలను చంపడానికి, తన భార్యను ఆమె కుటుంబ నుంచి వేరు చేయడానికి, ఆమెను ఒంటరి చేయడానికి మూడు నాలుగు నెలల్లో ఇంటర్నెల్లో చూసి బాంబులు, ఆయుధాల తయారీని నేర్చుకోవడం ప్రారంభించినట్లు విచారణ తేలింది. రూపన్ రావుతో పాటు సహ నిందితులు సల్ఫర్ పౌడర్, బ్లేడ్లు, బ్యాటరీలు, బొగ్గు, బాణాసంచా నుంచి గన్పౌడర్ వంటి పదార్థాలను ఉపయోగించి రిమోట్ కంట్రోల్డ్ బాంబులను తయారు చేసిన కుట్ర పన్నారు.
రూపన్ రావుకి రోహన్ రావల్(21), గౌరవ్ గాధవి సహకరించాడు. శుక్రవారం రాత్రి సుఖాడియా ఇంటికి రావల్ మొదట బాంబు ఉన్న పార్సిల్ని తీసుకెళ్లాడు. అయితే, వారి టార్గెట్ ఇంట్లో లేకపోవడంతో పార్సిల్ ఇవ్వకుండానే వెనుదిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ మరుసటి రోజు పార్సిట్ డెలివరీ చేయడానికి గాధమిని పంపించారు. రావల్ వెనక నుంచి రిమోట్ కంట్రోల్ ఉపయోగించి బాంబును పేల్చారు. రూపన్ రావు తన అత్తమామల్ని, బావమరిదిని కూడా ఇదే విధంగా హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు డీసీసీ వెల్లడించారు.
పేలుడు ఘటన తర్వాత గాధవిని స్పాట్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను వెంబడిస్తున్నప్పుడు, పోలీసులు ఒక కారు నుంచి రెండు లైవ్ బాంబుల్ని కనుగొన్నారు. వాటిని తర్వాత నిర్వీర్యం చేశారు. అదే కారులో కంట్రీ మేడ్ పిస్టల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు, అక్రమ ఆయుధాల సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!