Crime: రూ. 30,000 ఇవ్వని సోదరుడు.. వదినతో సహా మూడు నెలల శిశువు హత్య..
- ఘజియాబాద్లో దారుణం..
- వదినతో సహా మూడు నెలల చిన్నారి హత్య..
- తన అన్న రూ. 30,000 ఇవ్వకుండా చేసిందని పగ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో దారుణం జరిగింది. తన వదినతో జరిగిన పాత గొడవను మనుసులో ఉంచకుని ఓ వ్యక్తి దారుణం హత్యలకు పాల్పడ్డారు. వదినతో పాటు ఆమె మూడు నెలల కుమార్తెని గొంతు నులిమి చంపేశాడు. ఈ జంట హత్యలో నిందితుడు 23 ఏళ్ల జీషాన్ని పోలీసులు అరెస్ట్ చేరవారు. జీషాన్ రెండు నెలల క్రితం తన కజిన్ సోదరుడు తనపై దాడి చేయడాన్ని అవమానంగా భావించిన జీషాన్ వదినపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. దీంతో పాటు పని కోసం తన సోదరుడిని రూ. 30,000 అడిగితే ఇవ్వకపోవడం, ఇందుకు తన వదినే కారణమనే అనుమానాన్ని పెంచుకున్నాడు.
Read Also: Raja Singh: రోడ్డుపై నమాజ్ చేస్తే, హనుమాన్ చాలీసా.. రాజా సింగ్ సంచలనం..
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
అయితే, ఈ హత్యల్ని చూసిన మృతురాలి మరో కుమార్తె అక్కడ నుంచి పారిపోవడంతో దాడి నుంచి బయటపడిందని పోలీసులు చెప్పారు. మృతురాలు షాహీద్ పర్వీన్(34), ఆమె కుమార్తె ఆఫియాగా గుర్తించారు. ఘజియాబాద్ రూరల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సురేంద్రనాథ్ త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం.. వేవ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బమ్హేటా గ్రామంలో సోమవారం ఈ హత్యలు జరిగాయి.
జిషాన్, షాహీన్ని తన ఇద్దరు పిల్లల ముందే దుపట్టాతో గొంతు నులిమినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఆఫియాను తన చేతులతో గొంతు నులిమి చంపారు. ఆ సమయంలో మూడున్నరేళ్ల అన్భియా ఏడుస్తూ భయపడి అక్కడ నుంచి పారిపోయింది. ఒక వేళ ఆమె అక్కడే ఉంటే నిందితుడు అతడిని చంపేసేవాడని డీసీసీ చెప్పారు. రెండు నెలల క్రితం.. బీహార్లో జీషాన్ కుటుంబం ఇంటి నిర్మాణంపై వివాదంలో షహీన్ కజిన్ సోదరుడు అఫ్రోజ్ అవమానించారు. అతడి కాలర్ పట్టుకుని లాగడంతో పగ పెంచుకున్నారు. అయితే, దుబాయ్ వెళ్లాలనుకుంటున్న జీషాన్కి తన సోదరుడు బుర్హాన్ రూ.30,000 ఇవ్వకుండా వదిన షహీన్ అడ్డుకుండని అనుమానం పెంచుకున్నాడు. నేరం చేసిన తర్వాత జీషాన్ నోయిడాకు పారిపోయాడు. మహిళ సెల్ఫోన్ లాక్కుని బుర్హాన్కి ఫోన్ చేసి చంపుతానని బెదిరించాడు. నిందితుడు మంగళవారం ఘజియాబాద్కి తిరిగి వస్తుండగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!