Crime: రూ. 30,000 ఇవ్వని సోదరుడు.. వదినతో సహా మూడు నెలల శిశువు హత్య..
- ఘజియాబాద్లో దారుణం..
- వదినతో సహా మూడు నెలల చిన్నారి హత్య..
- తన అన్న రూ. 30,000 ఇవ్వకుండా చేసిందని పగ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో దారుణం జరిగింది. తన వదినతో జరిగిన పాత గొడవను మనుసులో ఉంచకుని ఓ వ్యక్తి దారుణం హత్యలకు పాల్పడ్డారు. వదినతో పాటు ఆమె మూడు నెలల కుమార్తెని గొంతు నులిమి చంపేశాడు. ఈ జంట హత్యలో నిందితుడు 23 ఏళ్ల జీషాన్ని పోలీసులు అరెస్ట్ చేరవారు. జీషాన్ రెండు నెలల క్రితం తన కజిన్ సోదరుడు తనపై దాడి చేయడాన్ని అవమానంగా భావించిన జీషాన్ వదినపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. దీంతో పాటు పని కోసం తన సోదరుడిని రూ. 30,000 అడిగితే ఇవ్వకపోవడం, ఇందుకు తన వదినే కారణమనే అనుమానాన్ని పెంచుకున్నాడు.
Read Also: Raja Singh: రోడ్డుపై నమాజ్ చేస్తే, హనుమాన్ చాలీసా.. రాజా సింగ్ సంచలనం..
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
అయితే, ఈ హత్యల్ని చూసిన మృతురాలి మరో కుమార్తె అక్కడ నుంచి పారిపోవడంతో దాడి నుంచి బయటపడిందని పోలీసులు చెప్పారు. మృతురాలు షాహీద్ పర్వీన్(34), ఆమె కుమార్తె ఆఫియాగా గుర్తించారు. ఘజియాబాద్ రూరల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సురేంద్రనాథ్ త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం.. వేవ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బమ్హేటా గ్రామంలో సోమవారం ఈ హత్యలు జరిగాయి.
జిషాన్, షాహీన్ని తన ఇద్దరు పిల్లల ముందే దుపట్టాతో గొంతు నులిమినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఆఫియాను తన చేతులతో గొంతు నులిమి చంపారు. ఆ సమయంలో మూడున్నరేళ్ల అన్భియా ఏడుస్తూ భయపడి అక్కడ నుంచి పారిపోయింది. ఒక వేళ ఆమె అక్కడే ఉంటే నిందితుడు అతడిని చంపేసేవాడని డీసీసీ చెప్పారు. రెండు నెలల క్రితం.. బీహార్లో జీషాన్ కుటుంబం ఇంటి నిర్మాణంపై వివాదంలో షహీన్ కజిన్ సోదరుడు అఫ్రోజ్ అవమానించారు. అతడి కాలర్ పట్టుకుని లాగడంతో పగ పెంచుకున్నారు. అయితే, దుబాయ్ వెళ్లాలనుకుంటున్న జీషాన్కి తన సోదరుడు బుర్హాన్ రూ.30,000 ఇవ్వకుండా వదిన షహీన్ అడ్డుకుండని అనుమానం పెంచుకున్నాడు. నేరం చేసిన తర్వాత జీషాన్ నోయిడాకు పారిపోయాడు. మహిళ సెల్ఫోన్ లాక్కుని బుర్హాన్కి ఫోన్ చేసి చంపుతానని బెదిరించాడు. నిందితుడు మంగళవారం ఘజియాబాద్కి తిరిగి వస్తుండగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!