Man Sets Wife On Fire: ఆల్కహాల్ తాగుతుండగా భార్యతో వాగ్వాదం.. పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Sets Wife On Fire: మద్యం తాగుతుండగా భార్యభర్తల మధ్య గొడవ హత్యకు దారి తీసింది. మలేషియాకు చెందిన ఓ వ్యక్తి మద్యం తాగుతున్న సమయంలో భార్య అతడితో వాగ్వాదానికి దిగింది. గొడవ తీవ్రం కావడంతో సదరు వ్యక్తి తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. మలేషియాలోని సబా రాష్ట్రంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అక్కడి స్థానిక మీడియా నివేదించింది. స్థానిక మద్యం అయిన టపాయ్ తాగుతుండగా, భార్య భర్తల మధ్య గొడవ జరగడం ఈ ఘటనకు కారణమైంది.
Read Also: Guwahati: ట్రయాంగిల్ లవ్.. ఒకేగదిలో ముగ్గురు కలిశాక ఏం జరిగిందంటే..!
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
పోలీసుల వాదన ప్రకారం.. భర్త మద్యం తాగే సమయంలో భార్య తనకు నిప్పటించాలని సవాల్ చేసిందని, దీంతో కోపోద్రిక్తుడైన ఆమె భర్త, పెట్రోల్ పోసి నిప్పటించినట్లు వెల్లడించారు. ఈ సంఘటన నుంచి తల్లిని కాపాడేందుకు, మంటలు ఆర్పేందుకు 16 ఏళ్ల కూతురు ప్రయత్నించింది. ఆమె తన ఇద్దరు తమ్ముళ్లను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి రక్షించింది. తన బంధువు సాయంతో ఆమె తల్లిని చికిత్స కోసం కెనిన్గౌ ఆస్పత్రికి తరలించింది. అయితే, 16 గంటల తర్వాత 41 ఏళ్ల మహిళ గాయాల కారణంగా ఆదివారం మరణించింది.
హత్యకు పాల్పడిన భర్త(50)ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో కూడా నిందితుడు భార్యకు నిప్పు అంటిస్తానని బెదిరించే వాడని పోలీస్ అధికారి వెల్లడించారు. తదుపరి విచారణ నిమిత్తం ఫిబ్రవరి 9వ వరకు అతనికి రిమాండ్ విధించారు. గతంలో న్యూఢిల్లీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 32 ఏళ్ల మహిళ మద్యం తాగినందుకు తన భర్తతో గొడవ పడింది. నరేందర్ అనే వ్యక్తి తన భార్య బనితపై కొరోసిన్ పోసి నిప్పటించాడు.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!