NTV Telugu Site icon

Love Couple Suicide: కదులుతున్న రైలు నుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్య

Crime

Crime

ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఉదంతం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది. కదులుతున్న రైలు నుంచి దూకి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. రైలు నుంచి దూకిన తర్వాత యువకుడి మృతదేహం పిల్లర్‌లో ఇరుక్కుపోగా, బాలిక మృతదేహం నదిలో తేలింది. విషయం వెలుగులోకి రావడంతో ఛతర్‌పూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతి చెందిన యువకుడు ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడని తెలుస్తోంది. ప్రస్తుతం బాలిక వివరాలు తెలియరాలేదు.

READ MORE: Jani Master: జైలు నుంచి ఇంటికి.. జానీ మాస్టర్ ఎమోషనల్ వీడియో

పోలీసుల సమాచారం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 12:00 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హర్పాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చపదాన్ గ్రామ సమీపంలో చంబల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రేమ జంట ధసన్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దూకుతున్నప్పుడు.. యువకుడు వంతెనను ఢీకొట్టాడు. అక్కడికక్కడే మరణించాడు. అతని శరీరం వంతెన స్తంభానికి వేలాడుతూ ఉంది. యువతి రైలు నుంచి దూకగా, ఆమె మృతదేహం ధసన్ నదిలో తేలింది.

READ MORE: Pushpa 2 The Rule:టాలీవుడ్లో పుష్ప 2 మరో రికార్డు

పోలీసులు ఏం చెప్పారు?
నౌగావ్ ఎస్‌డిఓపి చంచలేష్ మర్క్‌రామ్ కేసు గురించి సమాచారం ఇచ్చారు. మరణించిన యువకుడు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా వాసి అని తెలిపారు. ప్రస్తుతం ఆ అమ్మాయి ఎవరు? అనే సమాచారం తెలియరాలేదని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే.. ఈ కేసు ఓ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు కనిపిస్తున్నా పోలీసులు మాత్రం ప్రతి కోణంలోనూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.