తెలుగు రాష్ట్రాల్లో రుణ యాప్లు ఎంతటి దారుణాలకు ఒడిగట్టాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈడీ తన వేగం పెంచింది. రుణ యాప్ ల కేసులో మరో రూ.51కోట్ల ఆస్తులు అటాచ్ చేశాయి. ఫైనాన్స్ కంపెనీ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన రూ.51 కోట్ల అటాచ్ అయ్యాయి. గతంలో పీసీ ఫైనాన్షియల్ కు చెందిన రూ.238 కోట్లు ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ.
క్యాష్ బీన్ మొబైల్ యాప్ ద్వారా రుణాలు ఇచ్చింది పీసీఎఫ్ఎస్. చైనాకు చెందిన జో యాహుయ్ అధీనంలో పీఎస్ఎఫ్ఎస్ పనిచేస్తోందని ఈడీ తెలిపింది. బోగస్ సాఫ్ట్ వేర్ ఎగుమతుల పేరిట విదేశాలకు నిధులు మళ్లించినట్లు గుర్తించిన ఈడీ చర్యలకు దిగింది. చైనా, హాంకాంగ్, తైవాన్, యూఎస్, సింగపూర్ కు సుమారు రూ.429 కోట్లు తరలించినట్లు ఈడీ వెల్లడించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు పీసీఎఫ్ఎస్ సొమ్ము జప్తు చేశామని ఈడీ తెలిపింది. ఈడీ దర్యాప్తు ఆధారంగా విచారణ ప్రారంభించాయి ఆర్ బీఐ, ఐటీ.