ఛీఛీ నీచం.. కోవిడ్ శాంపిల్ పేరుతో ఆమె ప్రైవేట్ భాగంలోకి దాన్ని దూర్చి
సమాజంలో రోజురోజుకు కామాంధులు ఎక్కువైపోతున్నారు. ఆడవారికి ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. ఇల్లు, స్కూల్, పోలీస్ స్టేషన్, హాస్పిటల్ కూడా వారికి రక్షణ ఇవ్వలేకపోతున్నాయి. చివరికి కోవిడ్ టెస్టుకు వచ్చిన మహిళలను కూడా కామాంధులు వదలడంలేదు. తాజాగా ఒక ల్యాబ్ టెక్నీషియన్.. కరోనా టెస్ట్ అని చెప్పి ఒక యువతి ప్రైవేట్ భాగంలో చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ కేసులో అతనికి నాయస్థానం పదేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అమరావతిలోని ఒక మాల్ లో ఒక ఉద్యోగి కి కరోనా పాజిటివ్ అని తేలడంతో యాజమాన్య మిగతా ఉద్యోగులందరికీ కరోనా టెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది. మాల్లోని ఉద్యోగులందరూ వడ్నేరాలోని ట్రామా కేర్ సెంటర్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. ట్రామా కేర్ సెంటర్లో అల్కేష్ దేశ్ముఖ్ అనే ఒక ల్యాబ్ టెక్నీషియన్ మాల్ ఉద్యోగులందరికీ కరోనా టెస్టులు చేశాడు. అందులో ఓ యువతికి కరోనా పాజిటివ్ వచ్చింది.. మిగతా టెస్టులకు ల్యాబ్ కి రావాలని తెలిపాడు. దీంతో భయపడిన ఆమె టెస్టులకు లోపలికి వెళ్ళింది. అక్కడ ఆల్కేష్ మీ ప్రైవేట్ పార్ట్ నుంచి స్వాబ్ సేకరించాల్సి ఉంటుందని చెప్పడంతో ఖంగుతిన్న యువతి తాను అలా చేయలేనని చెప్పింది. అయినా అతను వినకుండా కరోనా టెస్ట్ లో ఒక భాగమేనని నమ్మబతుకుతూ ఆమె ప్రైవేట్ పార్ట్ నుంచి ఒక స్వాబ్ శాంపిల్ సేకరించాడు. అంతేకాకుండా ఆమె ప్రైవేట్ పార్ట్ లో చేయి పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు.
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
ఇక యువతి ఈ విషయాన్నీ తన సోదరుడికి తెలుపడంతో గుట్టు రట్టయ్యింది. ఈ విషయం తెలుసుకొని కంగుతిన్న యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి వడ్నేరా పోలీస్ స్టేషన్కు వెళ్లి ల్యాబ్ టెక్నీషియన్ అల్కేష్ దేశ్ముఖ్పై కేసు నమోదు చేసింది. ఇక ఇటీవల ఈ కేసును అమరావతి జిల్లా కోర్టు విచారించి నిందితుడికి . 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. జైలు శిక్షతోపాటు నిందితుడిని రూ.10,000 జరిమానా చెల్లించవలసిందిగా ఆదేశించింది.
తాజావార్తలు
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
-
Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
Ashu Reddy Scam: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది!
-
The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్కి డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!