Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Kurnool Supari Murder Land Dispute 2025

Kurnool Supari Murder: దాయాదుల దారుణం.. సుపారి ఇచ్చి మరీ హత్య

Published Date :September 22, 2025 , 9:17 pm
By Shiva Ganesh
Kurnool Supari Murder: దాయాదుల దారుణం.. సుపారి ఇచ్చి మరీ హత్య
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kurnool Supari Murder: దాయాదుల మధ్య ఆస్తి వివాదం హత్యకు దారి తీసింది. చిన్నపాటి ఘర్షణ ప్రాణాల మీదకి తెచ్చింది. సుపారి ఇచ్చి మరీ సొంత వాళ్లనే హత్య చేయించారు. కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ తెరమరుగైనా ఇలాంటి చిన్న చిన్న విషయాలకే హత్యలు చేసుకుంటున్నారు.

READ ALSO: Post Master: పోస్టు మాస్టర్ ఇంటికి కన్నం వేసిన అసిస్టెంట్ పోస్టు మాస్టర్.. రూ. 8 లక్షలు చోరీ

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాల్లకు చెందిన పద్మనాభ రెడ్డి రాతి దూలం పోటీలకు వెళ్లాలంటే మహా ఆసక్తి. దీంతో వారాలు, నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండేవాడు. అయితే గత మే 13న ఇంటి నుంచి వెళ్లిన పద్మనాభ రెడ్డి.. చాలా రోజులైనా తిరిగి రాలేదు. భార్య శిరీష ఫోన్‌లో ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. కొన్నాళ్లపాటు ఇంటికి దూరంగా ఉండడం మామూలే కదా.. వస్తాడని ఎదురు చూసింది. రోజులు గడుస్తున్నా పద్మనాభ రెడ్డి నుంచి ఫోన్ కానీ, ఎలాంటి సమాచారం కానీ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు.. గ్రామంలో పద్మనాభ రెడ్డి దాయదులతో ఆస్తికోసం జరిగిన ఘర్షణ సమాచారం తెలిసింది. ఈ వ్యవహారంపై ఆరా తీస్తే మొత్తం సమాచారం బయటపడింది.

చక్రాల్లలో పద్మనాభ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి దాయాదులు. వారి మధ్య ఆస్తి వివాదం ఉంది. రామకృష్ణారెడ్డికి చెందిన 40 సెంట్ల స్థలాన్ని అమ్మేశాడు. అందుకు అడ్వాన్సుగా రూ.లక్షా 30 వేలు తీసుకున్నాడు పద్మనాభ రెడ్డి. అయితే ఆ స్థలం అమ్మకుండా దాయాదులు రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారు. వారసత్వంగా వచ్చిన ఆస్తులన్నీ ఇప్పటికే అమ్ముకున్నావని, ఈస్థలాన్ని అమ్మేందుకు తాము అంగీకరించబోమని దాయాదులు అభ్యంతరం చెప్పారు. ఈ విషయంలోనే వారి మధ్య ఘర్షణ జరిగింది. రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి మరికొందరితో కలసి పద్మనాభ రెడ్డిపై దాడి చేశారు. ఇనుప రాడ్డుతో దాడిచేయడంతో పద్మనాభరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తరువాత ఆటోలో తీసుకువెళ్లి ఆయన తండ్రి ఉండే రాంపురంలో వదిలివేశారు. గాయాల నుంచి తేరుకున్న పద్మనాభరెడ్డి తనపై దాడిచేసిన వారిని వదలబోనని గ్రామస్థులతో చెప్పాడు. దీంతో పద్మనాభ రెడ్డి నుంచి ప్రాణహాని హాని ఉందని భావించిన దాయాదులు రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి కలిసి పద్మనాభ రెడ్డి హత్య చేయాలని నిర్ణయించుకున్నారు…

పద్మనాభ రెడ్డి హత్యకు సర్పంచ్ శ్రీరామలుకు సుపారీ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి. రూ.లక్షా 30 వేలకు సుపారీ మాట్లాడుకున్నారు. మద్యం తాగేందుకు పద్మనాభ రెడ్డిని పిలిచి హత్య చేయాలని ప్లాన్ చేశారు. మద్యం తాగేందుకు అని చెప్పి సర్పంచ్ శ్రీరాములు తమ్ముడు సిద్ధరాముడు, అయ్యన్న, ఎద్దులదొడ్డి శ్రీరాములు, ప్రసాద్ రాంపురం సుంకులమ్మ ఆలయానికి పద్మనాభ రెడ్డిని తీసుకెళ్లారు. మద్యం తాగడం మొదలయ్యాక రాళ్లతో దాడి చేసి లుంగీతో గొంతు బిగించి హత్య చేశారు. పద్మనాభ రెడ్డి డెడ్‌బాడీ అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. డెడ్ బాడీ అక్కడే వదిలేస్తే ప్రాబ్లమ్ అవుతుందని రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి పద్మనాభ రెడ్డి మృతదేహాన్ని ప్యాపిలి సమీపంలోని లంకాయపల్లి చెరువులో పొదల్లో పూడ్చిపెట్టి రాళ్లు పెట్టారు.

లంకాయపల్లి చెరువులో మృతదేహం పూడ్చివేత
పద్మనాభ రెడ్డి అదృశ్యం హత్యగా నిర్దారణకు వచ్చిన పోలీసులు.. దాయాదులు రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి , సర్పంచ్ శ్రీరాములును అదుపులోకి తీసుకుని విచారించారు. పద్మనాభ రెడ్డి సుపారీ హత్యపై నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు లంకాయపల్లి చెరువులో పూడ్చిన మృతదేహం కోసం తవ్వారు. హత్య చేసి చాలా రోజులు కావడంతో పుర్రె, ఎముకలు మాత్రమే లభించాయి. పోలీస్ వాటిని స్వాధీనం చేసుకొని డి ఎన్ ఏ టెస్టు కోసం పంపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మిగతా నిందితులు పరారీలో ఉన్నారు.

READ ALSO: Mother kills Son: బిడ్డల కోసం.. కన్న కొడును చంపేసిన తల్లి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Crime News
  • Kurnool police arrest 2025
  • Kurnool supari murder
  • Lankayapalli body recovery
  • Padmanabha Reddy murder

తాజావార్తలు

  • Live in Relationship: సహజీవనం చేస్తున్న జంటలకు గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం

  • Hate Speech Bill: సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వాగితే జైలుకే.. అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు..

  • IPL 2026-MS Dhoni: ఎంఎస్ ధోనీ ఫాన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2026 మొత్తానికి దూరం, బిగ్ ట్విస్ట్ కూడా!

  • Maoist Narayana: అందుకే.. దేశ వ్యాప్తంగా పార్టీ కనుమరుగైంది!

  • 50 ఏళ్ల తర్వాత చంద్రుడి దిశగా మానవ యాత్ర.. NASA Artemis II mission సిద్ధం..!

ట్రెండింగ్‌

  • ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!

  • Migraine in Women: మహిళల్లో అమాంతంగా పెరుగుతున్న ‘మైగ్రేన్’ సమస్య.. కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ.!

  • Instagram Offline Reels: రీల్స్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘రీల్స్’ చూసేయొచ్చు .. ఎలాగంటే.!

  • Remedies for Cracked Heels : మీ పాదాల పగుళ్లకు ఇక చెక్.. ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు.!

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions