Kurnool Supari Murder: దాయాదుల దారుణం.. సుపారి ఇచ్చి మరీ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Supari Murder: దాయాదుల మధ్య ఆస్తి వివాదం హత్యకు దారి తీసింది. చిన్నపాటి ఘర్షణ ప్రాణాల మీదకి తెచ్చింది. సుపారి ఇచ్చి మరీ సొంత వాళ్లనే హత్య చేయించారు. కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ తెరమరుగైనా ఇలాంటి చిన్న చిన్న విషయాలకే హత్యలు చేసుకుంటున్నారు.
READ ALSO: Post Master: పోస్టు మాస్టర్ ఇంటికి కన్నం వేసిన అసిస్టెంట్ పోస్టు మాస్టర్.. రూ. 8 లక్షలు చోరీ
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాల్లకు చెందిన పద్మనాభ రెడ్డి రాతి దూలం పోటీలకు వెళ్లాలంటే మహా ఆసక్తి. దీంతో వారాలు, నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండేవాడు. అయితే గత మే 13న ఇంటి నుంచి వెళ్లిన పద్మనాభ రెడ్డి.. చాలా రోజులైనా తిరిగి రాలేదు. భార్య శిరీష ఫోన్లో ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. కొన్నాళ్లపాటు ఇంటికి దూరంగా ఉండడం మామూలే కదా.. వస్తాడని ఎదురు చూసింది. రోజులు గడుస్తున్నా పద్మనాభ రెడ్డి నుంచి ఫోన్ కానీ, ఎలాంటి సమాచారం కానీ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు.. గ్రామంలో పద్మనాభ రెడ్డి దాయదులతో ఆస్తికోసం జరిగిన ఘర్షణ సమాచారం తెలిసింది. ఈ వ్యవహారంపై ఆరా తీస్తే మొత్తం సమాచారం బయటపడింది.
చక్రాల్లలో పద్మనాభ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి దాయాదులు. వారి మధ్య ఆస్తి వివాదం ఉంది. రామకృష్ణారెడ్డికి చెందిన 40 సెంట్ల స్థలాన్ని అమ్మేశాడు. అందుకు అడ్వాన్సుగా రూ.లక్షా 30 వేలు తీసుకున్నాడు పద్మనాభ రెడ్డి. అయితే ఆ స్థలం అమ్మకుండా దాయాదులు రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారు. వారసత్వంగా వచ్చిన ఆస్తులన్నీ ఇప్పటికే అమ్ముకున్నావని, ఈస్థలాన్ని అమ్మేందుకు తాము అంగీకరించబోమని దాయాదులు అభ్యంతరం చెప్పారు. ఈ విషయంలోనే వారి మధ్య ఘర్షణ జరిగింది. రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి మరికొందరితో కలసి పద్మనాభ రెడ్డిపై దాడి చేశారు. ఇనుప రాడ్డుతో దాడిచేయడంతో పద్మనాభరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తరువాత ఆటోలో తీసుకువెళ్లి ఆయన తండ్రి ఉండే రాంపురంలో వదిలివేశారు. గాయాల నుంచి తేరుకున్న పద్మనాభరెడ్డి తనపై దాడిచేసిన వారిని వదలబోనని గ్రామస్థులతో చెప్పాడు. దీంతో పద్మనాభ రెడ్డి నుంచి ప్రాణహాని హాని ఉందని భావించిన దాయాదులు రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి కలిసి పద్మనాభ రెడ్డి హత్య చేయాలని నిర్ణయించుకున్నారు…
పద్మనాభ రెడ్డి హత్యకు సర్పంచ్ శ్రీరామలుకు సుపారీ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి. రూ.లక్షా 30 వేలకు సుపారీ మాట్లాడుకున్నారు. మద్యం తాగేందుకు పద్మనాభ రెడ్డిని పిలిచి హత్య చేయాలని ప్లాన్ చేశారు. మద్యం తాగేందుకు అని చెప్పి సర్పంచ్ శ్రీరాములు తమ్ముడు సిద్ధరాముడు, అయ్యన్న, ఎద్దులదొడ్డి శ్రీరాములు, ప్రసాద్ రాంపురం సుంకులమ్మ ఆలయానికి పద్మనాభ రెడ్డిని తీసుకెళ్లారు. మద్యం తాగడం మొదలయ్యాక రాళ్లతో దాడి చేసి లుంగీతో గొంతు బిగించి హత్య చేశారు. పద్మనాభ రెడ్డి డెడ్బాడీ అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. డెడ్ బాడీ అక్కడే వదిలేస్తే ప్రాబ్లమ్ అవుతుందని రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి పద్మనాభ రెడ్డి మృతదేహాన్ని ప్యాపిలి సమీపంలోని లంకాయపల్లి చెరువులో పొదల్లో పూడ్చిపెట్టి రాళ్లు పెట్టారు.
లంకాయపల్లి చెరువులో మృతదేహం పూడ్చివేత
పద్మనాభ రెడ్డి అదృశ్యం హత్యగా నిర్దారణకు వచ్చిన పోలీసులు.. దాయాదులు రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి , సర్పంచ్ శ్రీరాములును అదుపులోకి తీసుకుని విచారించారు. పద్మనాభ రెడ్డి సుపారీ హత్యపై నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు లంకాయపల్లి చెరువులో పూడ్చిన మృతదేహం కోసం తవ్వారు. హత్య చేసి చాలా రోజులు కావడంతో పుర్రె, ఎముకలు మాత్రమే లభించాయి. పోలీస్ వాటిని స్వాధీనం చేసుకొని డి ఎన్ ఏ టెస్టు కోసం పంపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మిగతా నిందితులు పరారీలో ఉన్నారు.
READ ALSO: Mother kills Son: బిడ్డల కోసం.. కన్న కొడును చంపేసిన తల్లి
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!