Killed with Tractor : పాత కక్షలు.. ట్రాక్టర్తో ఢీ కొట్టి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నేవూరి నరసయ్య (42) అనే వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీ కొట్టి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. గత కొద్దిరోజులుగా పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి హత్య కు పాల్పడినట్లుగా మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల అదుపులో అనుమానితుడు కిషన్ ఉన్నాడని తెలుసుకున్న బంధువులు… స్టేషన్ పై దాడి చేశారు. అంతేకాకుండా.. అడ్డొచ్చిన పోలీసులను కూడా మృతుడి బంధువులు చితకబాదారు. దీంతో ఒక్కసారి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రికత్త వాతావరణం చోటు చేసుకుంది. రుద్రంగి ఎస్సై, చందుర్తి సీఐ మృతిని పట్ల వ్యవహరించిన తీరు పై బంధువులు మండిపడ్డారు. అకారణంగా కేసులు పెట్టి హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్ములను ఎంతో హింసించావు భర్త పోయాడు ఇక తాళి తీసుకో అంటూ చందుర్తి సీఐ శ్రీలత కు మృతుడి భార్య దేవేంద్ర తాళి ఇవ్వడం గమనార్హం. సంఘటనా స్థలానికి చేరుకున్న వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి.. ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
రుద్రంగిలో కొనసాగుతున్న ఉద్రిక్తత…
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
మృతుడి మృతదేహంతో న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు బంధువుల, గ్రామస్తుల ధర్నాకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న అదనపు ఎస్పీ చంద్రయ్య మృతుడి బంధువులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా మృతుడి భార్య దేవేంద్ర మాట్లాడుతూ.. హత్య చేసిన కిషన్ కి మాకు మూడు ఏళ్ల నుంచి భూమి విషయంలో గొడవ జరుగుతుందని, అప్పటి నుండి అన్యాయనికే పోలీసులు మద్దతు ఇచ్చారని ఆమె ఆరోపించారు. రుద్రంగి ఎస్సై ముందే మా ఆయన పట్ల ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడని, మా ఆయనను గతంలో హార్వెస్టార్ తో గుద్దాడని, బండి డ్యామేజ్ అయింది. చేతికి గాయాలయ్యాయి.. మేము చందుర్తి సీఐ మేడమ్ గారికి ఫిర్యాదు చేస్తే…ఎవరైనా హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని వదిలిపెట్టి సీఐ మేడమ్ మళ్ళీ మా ఇంటికి వచ్చింది.. ఇదెక్కడి న్యాయం..పోలీసులది..ఇదా మీ పోలీసులు చేసే న్యాయం.. ఇది వరకే నా భర్తను కాపాడండి అంటూ సీఐ మేడమ్ కాళ్ళు మూడు సార్లు పట్టుకున్న అయిన నా భర్త ప్రాణం తీసాడు.. పోలీసులు న్యాయం చేయలేదు.. మీరు అన్యాయానికి సపోర్ట్ ఇచ్చారు మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు అంటూ మృతుడి భార్య దేవేంద్ర అగ్రహం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!