Killed with Tractor : పాత కక్షలు.. ట్రాక్టర్తో ఢీ కొట్టి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నేవూరి నరసయ్య (42) అనే వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీ కొట్టి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. గత కొద్దిరోజులుగా పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి హత్య కు పాల్పడినట్లుగా మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల అదుపులో అనుమానితుడు కిషన్ ఉన్నాడని తెలుసుకున్న బంధువులు… స్టేషన్ పై దాడి చేశారు. అంతేకాకుండా.. అడ్డొచ్చిన పోలీసులను కూడా మృతుడి బంధువులు చితకబాదారు. దీంతో ఒక్కసారి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రికత్త వాతావరణం చోటు చేసుకుంది. రుద్రంగి ఎస్సై, చందుర్తి సీఐ మృతిని పట్ల వ్యవహరించిన తీరు పై బంధువులు మండిపడ్డారు. అకారణంగా కేసులు పెట్టి హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్ములను ఎంతో హింసించావు భర్త పోయాడు ఇక తాళి తీసుకో అంటూ చందుర్తి సీఐ శ్రీలత కు మృతుడి భార్య దేవేంద్ర తాళి ఇవ్వడం గమనార్హం. సంఘటనా స్థలానికి చేరుకున్న వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి.. ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
రుద్రంగిలో కొనసాగుతున్న ఉద్రిక్తత…
Also Read
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
మృతుడి మృతదేహంతో న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు బంధువుల, గ్రామస్తుల ధర్నాకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న అదనపు ఎస్పీ చంద్రయ్య మృతుడి బంధువులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా మృతుడి భార్య దేవేంద్ర మాట్లాడుతూ.. హత్య చేసిన కిషన్ కి మాకు మూడు ఏళ్ల నుంచి భూమి విషయంలో గొడవ జరుగుతుందని, అప్పటి నుండి అన్యాయనికే పోలీసులు మద్దతు ఇచ్చారని ఆమె ఆరోపించారు. రుద్రంగి ఎస్సై ముందే మా ఆయన పట్ల ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడని, మా ఆయనను గతంలో హార్వెస్టార్ తో గుద్దాడని, బండి డ్యామేజ్ అయింది. చేతికి గాయాలయ్యాయి.. మేము చందుర్తి సీఐ మేడమ్ గారికి ఫిర్యాదు చేస్తే…ఎవరైనా హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని వదిలిపెట్టి సీఐ మేడమ్ మళ్ళీ మా ఇంటికి వచ్చింది.. ఇదెక్కడి న్యాయం..పోలీసులది..ఇదా మీ పోలీసులు చేసే న్యాయం.. ఇది వరకే నా భర్తను కాపాడండి అంటూ సీఐ మేడమ్ కాళ్ళు మూడు సార్లు పట్టుకున్న అయిన నా భర్త ప్రాణం తీసాడు.. పోలీసులు న్యాయం చేయలేదు.. మీరు అన్యాయానికి సపోర్ట్ ఇచ్చారు మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు అంటూ మృతుడి భార్య దేవేంద్ర అగ్రహం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
Telegram, Signal: వాట్సాప్ యూజర్నేమ్ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్కు కేంద్రం నోటీసులు.. కారణమేంటి?
-
T20 World Cup 2026: సెమీస్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ!
-
Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!