Killed with Tractor : పాత కక్షలు.. ట్రాక్టర్తో ఢీ కొట్టి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నేవూరి నరసయ్య (42) అనే వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీ కొట్టి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. గత కొద్దిరోజులుగా పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి హత్య కు పాల్పడినట్లుగా మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల అదుపులో అనుమానితుడు కిషన్ ఉన్నాడని తెలుసుకున్న బంధువులు… స్టేషన్ పై దాడి చేశారు. అంతేకాకుండా.. అడ్డొచ్చిన పోలీసులను కూడా మృతుడి బంధువులు చితకబాదారు. దీంతో ఒక్కసారి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రికత్త వాతావరణం చోటు చేసుకుంది. రుద్రంగి ఎస్సై, చందుర్తి సీఐ మృతిని పట్ల వ్యవహరించిన తీరు పై బంధువులు మండిపడ్డారు. అకారణంగా కేసులు పెట్టి హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్ములను ఎంతో హింసించావు భర్త పోయాడు ఇక తాళి తీసుకో అంటూ చందుర్తి సీఐ శ్రీలత కు మృతుడి భార్య దేవేంద్ర తాళి ఇవ్వడం గమనార్హం. సంఘటనా స్థలానికి చేరుకున్న వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి.. ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
రుద్రంగిలో కొనసాగుతున్న ఉద్రిక్తత…
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
మృతుడి మృతదేహంతో న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు బంధువుల, గ్రామస్తుల ధర్నాకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న అదనపు ఎస్పీ చంద్రయ్య మృతుడి బంధువులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా మృతుడి భార్య దేవేంద్ర మాట్లాడుతూ.. హత్య చేసిన కిషన్ కి మాకు మూడు ఏళ్ల నుంచి భూమి విషయంలో గొడవ జరుగుతుందని, అప్పటి నుండి అన్యాయనికే పోలీసులు మద్దతు ఇచ్చారని ఆమె ఆరోపించారు. రుద్రంగి ఎస్సై ముందే మా ఆయన పట్ల ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడని, మా ఆయనను గతంలో హార్వెస్టార్ తో గుద్దాడని, బండి డ్యామేజ్ అయింది. చేతికి గాయాలయ్యాయి.. మేము చందుర్తి సీఐ మేడమ్ గారికి ఫిర్యాదు చేస్తే…ఎవరైనా హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని వదిలిపెట్టి సీఐ మేడమ్ మళ్ళీ మా ఇంటికి వచ్చింది.. ఇదెక్కడి న్యాయం..పోలీసులది..ఇదా మీ పోలీసులు చేసే న్యాయం.. ఇది వరకే నా భర్తను కాపాడండి అంటూ సీఐ మేడమ్ కాళ్ళు మూడు సార్లు పట్టుకున్న అయిన నా భర్త ప్రాణం తీసాడు.. పోలీసులు న్యాయం చేయలేదు.. మీరు అన్యాయానికి సపోర్ట్ ఇచ్చారు మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు అంటూ మృతుడి భార్య దేవేంద్ర అగ్రహం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?