Jagtial: ప్రాణం తీసిన ప్రేమ.. యువకుడిని కొట్టి చంపిన ప్రియురాలి కుటుంబీకులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial: తెలంగాణలోని జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఎదురుగట్ల సతీష్ అనే యువకుడు.. డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ యువకుడిని దారుణంగా కర్రలతో కొట్టి చంపేశారు. అయితే సతీష్కు.. రేచపల్లిలోనే నివసించే ఒక యువతితో గత కొన్ని నెలలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆ ప్రేమ వ్యవహారమే సతీష్ హత్యకు కారణంగా తెలుస్తోంది.. వారిద్దరి ప్రేమను యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పైగా వివాహం ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి.. సతీష్తో సంబంధాన్ని ముగించమని ఆమెకు సూచించారు. దీంతో యువతి సతీష్కు తన నిర్ణయాన్ని తెలిపింది. దీనిపై కోపంతో సతీష్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టాడు.
READ MORE: Off The Record: మంత్రి రాజనర్సింహ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?
Also Read
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
“నేను ఆమెను ప్రేమిస్తున్నాను, ఎవరూ ఆమెను వివాహం చేసుకోకూడదు” అని ప్రకటించాడు. అంతేకాకుండా, అసభ్యకరమైన మెసేజ్లు పంపడం, యువతి ఫోటోలను గ్రామంలోని వాట్సాప్ గ్రూపుల్లో పంచడం వంటి చర్యలు చేశాడు. ఇవి యువతి బంధువులకు తీవ్రంగా కోపం తెప్పించాయి. యువతి తల్లిదండ్రులు, బంధువులు సతీష్ను పలుమార్లు హెచ్చరించారు. “ఇలాంటి చర్యలు ఆపేయి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు” అని చెప్పి, అతని తీరును మార్చుకోమని సూచించారు. కానీ సతీష్ ఈ హెచ్చరికలను పట్టించుకోలేదు. మరింత ధైర్యంగా పోస్టులు కొనసాగించాడు…
READ MORE: Chennai Accident: చెన్నైలో ఘోరం.. తొమ్మిది మంది మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు
ఈ క్రమంలో యువతి బంధువులు.. సతీష్ను ఇంటికి పిలిపించారు. తొలుత ఘర్షణ పడ్డారు. అది కాస్తా ముదరడంతో హత్యకు దారి తీసింది. కోపంతో యువతి తల్లిదండ్రులు, ఇతర బంధువులు సతీష్పై కర్రలు, చెక్కలతో కొట్టారు. తీవ్ర గాయాలతో సతీష్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. సతీష్ శవాన్ని పోస్ట్మార్టం కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పోలీసుల దర్యాప్తులో నలుగురు నిందితులను గుర్తించారు. హత్యకు పాల్పడినందుకు ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు..
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?