Chennai Accident: వరుస ప్రమాదాలు, మరణాలతో తమిళనాడు నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ప్రమాదాన్ని మరవక ముందే ఆ రాష్ట్రంలో మరో ప్రమాదం సంభవించింది. తాజా ప్రమాదంలో తోమ్మది మంది మృతి చెందగా, సుమారుగా 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. తిరువళ్లూరు జిల్లా ఎన్నోర్ థర్మల్ పవర్ స్టేషన్లో భారీ వలయం నిర్మిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో విరిగిన ఇసుప కమ్మీలు పైనుంచి పడిపోవడంతో ఉత్తరాదికి చెందిన 9 కార్మికులు తీవ్రమైన గాయాలతో మృతి చెందారు. అలాగే సుమారుగా 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. స్థానికులు గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
READ ALSO: Off The Record: కాళేశ్వరం కేసును సీబీఐ టేకప్ చేయదా? సర్కార్ కొత్త ప్లాన్