Jagtial: ప్రాణం తీసిన ప్రేమ.. యువకుడిని కొట్టి చంపిన ప్రియురాలి కుటుంబీకులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial: తెలంగాణలోని జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఎదురుగట్ల సతీష్ అనే యువకుడు.. డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ యువకుడిని దారుణంగా కర్రలతో కొట్టి చంపేశారు. అయితే సతీష్కు.. రేచపల్లిలోనే నివసించే ఒక యువతితో గత కొన్ని నెలలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆ ప్రేమ వ్యవహారమే సతీష్ హత్యకు కారణంగా తెలుస్తోంది.. వారిద్దరి ప్రేమను యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పైగా వివాహం ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి.. సతీష్తో సంబంధాన్ని ముగించమని ఆమెకు సూచించారు. దీంతో యువతి సతీష్కు తన నిర్ణయాన్ని తెలిపింది. దీనిపై కోపంతో సతీష్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టాడు.
READ MORE: Off The Record: మంత్రి రాజనర్సింహ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
“నేను ఆమెను ప్రేమిస్తున్నాను, ఎవరూ ఆమెను వివాహం చేసుకోకూడదు” అని ప్రకటించాడు. అంతేకాకుండా, అసభ్యకరమైన మెసేజ్లు పంపడం, యువతి ఫోటోలను గ్రామంలోని వాట్సాప్ గ్రూపుల్లో పంచడం వంటి చర్యలు చేశాడు. ఇవి యువతి బంధువులకు తీవ్రంగా కోపం తెప్పించాయి. యువతి తల్లిదండ్రులు, బంధువులు సతీష్ను పలుమార్లు హెచ్చరించారు. “ఇలాంటి చర్యలు ఆపేయి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు” అని చెప్పి, అతని తీరును మార్చుకోమని సూచించారు. కానీ సతీష్ ఈ హెచ్చరికలను పట్టించుకోలేదు. మరింత ధైర్యంగా పోస్టులు కొనసాగించాడు…
READ MORE: Chennai Accident: చెన్నైలో ఘోరం.. తొమ్మిది మంది మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు
ఈ క్రమంలో యువతి బంధువులు.. సతీష్ను ఇంటికి పిలిపించారు. తొలుత ఘర్షణ పడ్డారు. అది కాస్తా ముదరడంతో హత్యకు దారి తీసింది. కోపంతో యువతి తల్లిదండ్రులు, ఇతర బంధువులు సతీష్పై కర్రలు, చెక్కలతో కొట్టారు. తీవ్ర గాయాలతో సతీష్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. సతీష్ శవాన్ని పోస్ట్మార్టం కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పోలీసుల దర్యాప్తులో నలుగురు నిందితులను గుర్తించారు. హత్యకు పాల్పడినందుకు ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు..
తాజావార్తలు
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..