Crime News: ఆరేళ్ల ప్రేమ.. 6 రోజులు కూడా కాపురం చేయక ముందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: కొత్తగా పెళ్లైంది. సంతోషంగా నవ దంపతులు ఇద్దరూ యువతి ఇంటికి వచ్చారు. ఇంతలోనే చిన్న ఘర్షణ..తిరిగి ఇద్దరూ కలిసి తమ ఇంటికి వెళ్లిపోయారు. కానీ చిన్నగా ఏర్పడ్డ వివాదం కాస్తా.. క్షణికావేశంలో నవ వధువు ఆత్మహత్య చేసుకునే వరకు దారి తీసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఎర్దండిలో జరిగింది. చిన్న కారణంతో ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి సూసైడ్ చేసుకోవడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటనలో అసలేం జరిగింది?
ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు గంగోత్రి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి స్వస్థలం. అక్కడే వడ్డెర కాలనీలో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. ఐతే గంగోత్రి.. తన ఇంటి ఎదురుగానే ఉంటున్న సంతోష్ను ఇష్టపడింది. ఆరేళ్ల నుంచి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒక్కటి కావాలని అనుకున్నారు. చివరికి ఇరు వైపులా పెద్దలను ఒప్పించి సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నారు.
Also Read
- Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
- Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
Insurance Murder: ఛీ..ఛీ.. ఇలా కూడా డబ్బు సంపాదిస్తారా? రూ. 5కోట్ల జీవితబీమా క్లైమ్ కోసం ఏకంగా..
నవ దంపతులకు దసరా తొలి పండుగ కావడంతో ఇద్దరూ కలిసి గంగోత్రి ఇంటికి వచ్చారు. పండగను సరదాగా గడిపేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఐతే దసరా రాజున దంపతులిద్దరూ గంగోత్రి తల్లి గారి ఇంటిలో భోజనాలు చేస్తున్న సమయంలో సంతోష్.. మన ఇంట్లో మటన్ తెస్తే తినని నువ్వు.. మీ ఇంట్లో చికెన్ ఎలా తింటున్నావని గంగోత్రిని ప్రశ్నించాడు. అది కాస్తా ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. ఈ సమయంలో గంగోత్రికి మటన్ అంటే ఇష్టం ఉండదని.. చికెన్ తింటుందని ఆమె కుటుంబం సర్ది చెప్పింది. అంతా ఆ గొడవ అక్కడితో సద్దుమణిగిందనుకున్నారు.
గొడవ జరిగిన తర్వాత ఇద్దరు కలిసి తిరిగి అత్తగారింటికి వెళ్లారు. అక్కడ మళ్లీ గొడవ జరిగిందో ఏమో తెలియదు కానీ.. గంగోత్రి అత్తగారింటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈఘటనతో అంతా షాకయ్యారు. గొడవను మనసులో పెట్టుకుని తన కూతురును బలవంతంగా తీసుకు వెళ్లారని గంగోత్రి తల్లి శారద ఆరోపిస్తోంది. మరోవైపు ఆమె మృతికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదని బంధువులు అంటున్నారు. మొత్తంగా ఆమె చనిపోవడం బాధాకరమని చెబుతున్నారు. ఆరు సంవత్సరాలు ప్రేమించి.. పెళ్లి చేసుకున్న తర్వాత 6 రోజులు కూడా కాపురం చేయక నవ వధువు సూసైడ్ చేసుకోవడం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.
తాజావార్తలు
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
-
Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్లో ఉన్నది అదే అంటూ..
-
Story Board : ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
-
US-Iran: తూచ్.. హార్ముజ్పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్హౌస్ ఖండన
-
Mental Health: 120కోట్ల మందిని పట్టి పీడిస్తోన్న శాపం.. ఇది క్యాన్సర్ కంటే డేంజర్ భయ్యా!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!