NTV Telugu Site icon

Indore: పెళ్లి చేసుకుంటానని విడాకులు తీసుకున్న మహిళపై అత్యాచారం..

Indore

Indore

Indore: దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో చోట మహిళపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు మహిళలపై అత్యాచారాలు దగ్గరి వ్యక్తులు, తెలిసిన వ్యక్తుల నుంచే ఎదురవుతున్నాయి. తాజాగా ఇండోర్‌లో ఓ వ్యక్తి మహిళను నమ్మించి అత్యాచారానికి ఒడిగట్టాడు. విడాకులు తీసుకున్న మహిళని పెళ్లి చేసుకుంటా అని నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సదరు వ్యక్తికి అప్పటికే పెళ్లైనప్పటికీ, తాను సింగిల్ అని చెబుతూ నమ్మిస్తూ వచ్చాడు.

ఈ కేసులో నోయిడాకు చెందిన మహ్మద్ అకీల్ అనే నిందితుడిపై మహిళ ఫిర్యాదు చేసింది. నిందితుడు తాను సింగిల్ అని చెబుతూ, మహిళతో స్నేహం చేశాడు. అనంతరం ఇండోర్ వచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు.నిందితుడు మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పి వారం రోజుల క్రితం ఢిల్లీకి తీసుకెళ్లినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అయితే, ఢిల్లీలో ఉన్నప్పుడు నిందితుడికి అప్పటికే పెళ్లయి నలుగురు పిల్లలు ఉన్నట్లు, తాను పెళ్లి చేసుకోలేనని మహిళతో చెప్పాడు.

Read Also: Gold Rate Today: బంగారం పెరుగుదలకు బ్రేక్.. భారీగా తగ్గిన వెండి ధర! హైదరాబాద్‌లో రేట్స్ ఎలా ఉన్నాయంటే?

తాను విడాకులు తీసుకున్నట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తనకు మహ్మద్ అఖిల్‌‌తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడినట్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసింది. దాదాపు రెండు నెలల క్రితం, ఆమె కేదార్‌నాథ్ పర్యటన నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఢిల్లీలో అఖిల్‌ని కలిసింది. అఖిల్ ఇండోర్ వచ్చి తనతో రిలేషన్‌షిప్ ఏర్పాటు చేసుకున్నట్లు ఆమె పేర్కొంది. తనను పెళ్లి చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్దామని అతను తనకు చెప్పినట్లు తెలిపింది. ఆగస్టు 13న ఇద్దరు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కూడా నిందితుడు సదరు మహిళతో సంబంధాన్ని కొనసాగించాడు.

ఇదిలా ఉండగా, తనకు అప్పటికే వివాహమైనట్లు చెప్పాడని మహిళ పేర్కొంది. తన భార్య ఉత్తర్‌ప్రదేశ్‌లో నివసిస్తుందని, తనకు నలుగురు పిల్లలు ఉన్నట్లు చెప్పాడని చెప్పినట్లు మహిళ వెల్లడించింది. దీని తర్వాత మహిళ ఇండోర్ తిరిగి వచ్చింది. ఈ ఘటనను రైట్ వింగ్ కార్యకర్తలకు చెప్పడంతో వారు అఖిల్‌ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.