Indore: మరోసారి వేడెక్కిన నవజాత శిశువు కేసు..
- ఐసీయూలో ఉన్న బాలిక నాలుగు వేళ్లను
- ఎలుకలు కొరికి చంపాయని ఆరోపించిన గిరిజన సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోర్లోని MYH ఆసుపత్రిలో అనుమానాస్పద స్థితిలో నవజాత శిశువు మరణించిన కేసు మరోసారి వేడెక్కింది. ఐసీయూలో ఉన్న బాలిక నాలుగు వేళ్లను ఎలుకలు కొరికి చంపాయని గిరిజన సంస్థ JAYS ఆరోపించింది. మృతదేహాన్ని ప్లాస్టిక్లో ప్యాక్ చేసి కుటుంబానికి అప్పగించారు. అంత్యక్రియలకు ముందు శిశువు చేతి వేళ్లు కనిపించకపోవడంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని మహారాజా యశ్వంతరావు (ఎంవైహెచ్) ఆసుపత్రిలో ఎలుకలకు సంబంధించిన కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద పరిస్థితుల్లో నవజాత శిశువు మరణించిన కేసు పెద్ద సమస్యగా మారింది. ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా ఎలుకలు బాలిక నాలుగు వేళ్లను కొరికాయని, దాని కారణంగా ఆమె చనిపోయిందని గిరిజన సంస్థ జై ఆదివాసీ యువ శక్తి (జేవైఎస్) వెల్లడించింది. ఈ కేసులో ఆసుపత్రి వర్గాలు అబద్దాలు చెప్పి.. ఈ విషయాన్ని అణచి వేసేందుకు ప్రయత్నించిందన్నారు.
Also Read
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
అయితే, ఆసుపత్రి యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 31 రాత్రి నుండి సెప్టెంబర్ 1 ఉదయం మధ్య, ఐసీయూలో చేరిన ఇద్దరు నవజాత బాలికలపై ఎలుకలు దాడి చేశాయి. ఇద్దరు బాలికలు ఇప్పటికే పుట్టుకతో వచ్చే వ్యాధులతో బాధపడుతూ.. చికిత్స సమయంలో మరణించారు. ఈ బాలికలలో ఒకరు ధార్ జిల్లాకు చెందిన దేవ్రామ్ అనే వ్యక్తి కుమార్తె, మరొక అమ్మాయి దేవాస్కు చెందినది. రెండు జిల్లాలు ఇండోర్ సమీపంలో ఉన్నాయి.
గిరిజన సంస్థ JAYS జాతీయ అధ్యక్షుడు లోకేష్ ముజల్దా అన్నారు. బాలిక మరణించిన తర్వాత, ఆసుపత్రి వారు ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి శనివారం సాయంత్రం కుటుంబానికి అప్పగించారని అన్నారు. అంత్యక్రియలకు ముందు కుటుంబం ప్యాకింగ్ తొలగించినప్పుడు, ఒక చేతికి చెందిన నాలుగు వేళ్లు కనిపించడం లేదని, ఎలుకలు వాటిని కొరికాయని వారు చూశారు. వేళ్లపై చిన్న గాయాలు ఉన్నాయని ఆసుపత్రి యాజమాన్యం మొదట అబద్ధం చెప్పిందని, కానీ వాస్తవం వేరే ఉందని ఆయన ఆరోపించారు.
మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ అరవింద్ ఘంఘోరియా ఆరోపణలను ఖండించారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేయడానికి ముగ్గురు వైద్యుల బృందం పోస్ట్మార్టం నిర్వహించిందని, దాని ఆధారంగా పరిస్థితి స్పష్టమైందని ఆయన అన్నారు. అయితే, పరిశుభ్రత, ఎలుకల నియంత్రణ ,భద్రతా చర్యలలో మెరుగుదలలు జరుగుతున్నాయని ఆయన అంగీకరించారు. ఆసుపత్రి యాజమాన్యం ఇప్పటివరకు ఆరుగురు ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుందని, వారిలో కొందరిని సస్పెండ్ చేసి పదవి నుండి తొలగించారని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?