Mumbai Mira Road Incident: ముంబై “లివ్ ఇన్ పార్ట్నర్” హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Mira Road Incident: ముంబై మీరా రోడ్ హత్య కేసులో సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లివ్ ఇన్ పార్ట్నర్ అయిన 32 ఏళ్ల సరస్వతి వైద్య అనే మహిళను హత్య చేసి ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి శరీర భాగాలను ఉడికించి పలు ప్రాంతాల్లో పారేశాడు. ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్యను తలపించేలా ఈ హత్య జరిగింది. నిందితుడు మనోజ్ సానే(56)తో గత కొంతకాలంగా సహజీవనంలో ఉన్నారు. ఈ హత్య వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే ఈ కేసులో పలు ట్విస్టులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు నిందితుడు మనోజ్ సానే, మృతురాలు సరస్వతి వైద్యం సహజీవనం చేస్తున్నారని అంతా అనుకున్నప్పటికీ..వీరికి వివాహం జరిగిందనే కొత్త విషయం విచారణలో వెలుగులోకి వచ్చింది. మృతురాలు తన నలుగురు అక్కాచెల్లిళ్లతో టచ్ లోనే ఉంది. వీరిలో ముగ్గురిని శుక్రవారం పోలీసులు విచారించారు. సరస్వతి, మనోజ్ సానే ఒక దేవాలయంలో వివాహం చేసుకున్నారని, ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో ఎవరికి చెప్పలేదని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
Read Also: Google: మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందే, లేకపోతే.. ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్..
అహ్మద్నగర్లో పాఠశాల మానేసిన సరస్వతి ముంబైకి వెళ్లడానికి ముందు కొన్ని సంవత్సరాలు తన అక్కలతో కలిసి నివసించింది. బోరివలిలోని ఓ రేషన్ షాపులో నిందితుడు మనోజ్ సానేని సరస్వతి కలుసుకుంది. మనోజ్ సానే ఆ షాపులోనే పనిచేసేవాడు. ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరగడం, ఆ తరువాత సరస్వతికి, సానే జాబ్ చూసిపెట్టారు. చివరకు ఇద్దరు కూడా ఒకే ఇంట్లో కలిసి నివసించే వరకు బంధం బలపడింది. సరస్వతి చిన్నతనంలోనే తల్లిని కోల్పోగా.. తండ్రి వదిలివెళ్లిపోయాడు. సరస్వతితో పాటు ఆమె సోదరీమణులందరూ అనాథాశ్రయంలో పెరిగారు.
ఇదిలా ఉంటే నిందితుడు సానే.. పోలీస్ విచారణలో సరస్వతి విషం తాగి ఆత్మహత్య చేసుకుందని, దీంతో భయపడిన తాను శరీరాన్ని ముక్కులగా చేసినట్లు పేర్కొన్నాడు. నేరాన్ని కప్పిపుచ్చేందుకే అతడు అబద్దాలు ఆడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నిందితుడు ఎందుకు హత్య చేయడానికి కారణాలు ఇంకా నిర్థారణ కాలేదు. సానే ఎలక్ట్రిక్ రంపంతో సరస్వతి మృతదేహాన్ని ముక్కలుగా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మంగళవారం వీరుంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!