Mumbai Mira Road Incident: ముంబై “లివ్ ఇన్ పార్ట్నర్” హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
Mumbai Mira Road Incident: ముంబై మీరా రోడ్ హత్య కేసులో సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లివ్ ఇన్ పార్ట్నర్ అయిన 32 ఏళ్ల సరస్వతి వైద్య అనే మహిళను హత్య చేసి ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి శరీర భాగాలను ఉడికించి పలు ప్రాంతాల్లో పారేశాడు. ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్యను తలపించేలా ఈ హత్య జరిగింది. నిందితుడు మనోజ్ సానే(56)తో గత కొంతకాలంగా సహజీవనంలో ఉన్నారు. ఈ హత్య వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే ఈ కేసులో పలు ట్విస్టులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు నిందితుడు మనోజ్ సానే, మృతురాలు సరస్వతి వైద్యం సహజీవనం చేస్తున్నారని అంతా అనుకున్నప్పటికీ..వీరికి వివాహం జరిగిందనే కొత్త విషయం విచారణలో వెలుగులోకి వచ్చింది. మృతురాలు తన నలుగురు అక్కాచెల్లిళ్లతో టచ్ లోనే ఉంది. వీరిలో ముగ్గురిని శుక్రవారం పోలీసులు విచారించారు. సరస్వతి, మనోజ్ సానే ఒక దేవాలయంలో వివాహం చేసుకున్నారని, ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో ఎవరికి చెప్పలేదని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
- Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..
- Shocking: జిమ్కు వెళ్తుందని భార్య దారుణహత్య..
- IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..
Read Also: Google: మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందే, లేకపోతే.. ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్..
అహ్మద్నగర్లో పాఠశాల మానేసిన సరస్వతి ముంబైకి వెళ్లడానికి ముందు కొన్ని సంవత్సరాలు తన అక్కలతో కలిసి నివసించింది. బోరివలిలోని ఓ రేషన్ షాపులో నిందితుడు మనోజ్ సానేని సరస్వతి కలుసుకుంది. మనోజ్ సానే ఆ షాపులోనే పనిచేసేవాడు. ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరగడం, ఆ తరువాత సరస్వతికి, సానే జాబ్ చూసిపెట్టారు. చివరకు ఇద్దరు కూడా ఒకే ఇంట్లో కలిసి నివసించే వరకు బంధం బలపడింది. సరస్వతి చిన్నతనంలోనే తల్లిని కోల్పోగా.. తండ్రి వదిలివెళ్లిపోయాడు. సరస్వతితో పాటు ఆమె సోదరీమణులందరూ అనాథాశ్రయంలో పెరిగారు.
ఇదిలా ఉంటే నిందితుడు సానే.. పోలీస్ విచారణలో సరస్వతి విషం తాగి ఆత్మహత్య చేసుకుందని, దీంతో భయపడిన తాను శరీరాన్ని ముక్కులగా చేసినట్లు పేర్కొన్నాడు. నేరాన్ని కప్పిపుచ్చేందుకే అతడు అబద్దాలు ఆడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నిందితుడు ఎందుకు హత్య చేయడానికి కారణాలు ఇంకా నిర్థారణ కాలేదు. సానే ఎలక్ట్రిక్ రంపంతో సరస్వతి మృతదేహాన్ని ముక్కలుగా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మంగళవారం వీరుంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
-
Ishan Kishan: కెప్టెన్గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
-
Rashmika-Mysa: ‘మైసా’ షూటింగ్ అప్డేట్ అదిరిపోయింది..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!