Double Fraud : డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానంటూ బురిడీ
- డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి రూ.5 లక్షలు వసూలు
- 100 మందిని మోసగించిన మేడిపల్లి నాగరాజు
- రూ.5 కోట్ల మోసం చేసి పరారైన నిందితుడు
- బ్రోకర్ల మాటలు నమ్మవద్దని హెచ్చరిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double Fraud : సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు పేద, మధ్య తరగతి వర్గాల వారు నానా తంటాలు పడుతున్నారు. అదీ హైదరాబాద్ లాంటి నగరంలో అయితే వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. కనీసం ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్తోనైనా తమ కల సాకారం అవుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్లను ట్రార్గెట్ చేస్తూ కొంత మంది బ్రోకర్లు.. అందిన కాడికి దోచుకుంటున్నారు. హైదరాబాద్ మేడిపల్లిలో అదే జరిగింది. సొంతింటి కోసం కలలు కంటున్న వారినే టార్గెట్ చేసే నాగరాజు.. మేడిపల్లి అమృత కాలనీలో ఉంటూ మోసానికి తెగబడ్డాడు.
Off The Record: టీడీపీ అధికారంలో ఉన్నా అక్కడ ఇంఛార్జ్ కరువా?
Also Read
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
చాలా మందికి డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని ఆశలు కల్పించాడు. కేవలం రూ. 5 లక్షలు కడితే చాలు డబుల్ బెడ్ రూమ్ మీ సొంతమవుతుందని ఆశ చూపించాడు. ఇంకేముంది తన వద్దకు వచ్చిన జనాలకు నిలువునా కుచ్చు టోపీ పెట్టాడు. దాదాపు 100 మంది 5 కోట్ల రూపాయలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. నాగరాజు దగ్గర 2, 3 ఏళ్ల క్రితం చాలా మంది బాధితులు డబ్బులు చెల్లించారు. వారు అడిగినప్పుడల్లా ఇదిగో అదిగో అంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇక లాభం లేదని అతన్ని గట్టిగా నిలదీసేందుకు బాధితులంతా నాగరాజు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో నాగరాజు ఇంట్లో లేకపోవడంతో గొడవ చేశారు. దీంతో పోలీసులు వచ్చి.. తమకు ఫిర్యాదు చేయాలని కోరడంతో మేడిపల్లి పీఎస్ కు వెళ్లారు.. అసలు డబుల్ బెడ్ రూమ్ కోసం ఇలా ఎవరిని పడితే వారిని నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. అర్హత ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయిస్తుందంటున్నారు.
AP Crime: కోట్లది రూపాయల మోసం.. వైసీపీ నేతపై పీడీ యాక్ట్, లుక్అవుట్ నోటీసులు జారీ
తాజావార్తలు
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
-
SIR Phase-3 : దేశవ్యాప్తంగా ‘SIR ఫేజ్-3’ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!