Serial killer: “లిఫ్ట్ ఇచ్చి హత్య”..11 మందిని చంపిన సీరియల్ కిల్లర్ అరెస్ట్..
- 18 నెలల వ్యవధిలో 11 హత్యలు..
- బాధితులంతా మగవాళ్లే.. లిఫ్ట్ ఇచ్చి హత్య..
- పంజాబ్ సీరియల్ కిల్లర్ని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Serial killer: పంజాబ్లో గత 18 నెలల వ్యవధిలో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు లిఫ్ట్ ఇచ్చి, ఆ తర్వాత వారిని దోచుకుని హత్యలకు పాల్పడుతున్న వ్యక్తిని మంగళవారం రూపనగర్ జిల్లాలో పట్టుకున్నారు. నిందితుడిని హోషియార్పూర్ జిల్లాలో గర్శంకర్లోని చౌరా గ్రామానికి చెందిన 33 ఏళ్ల రామ్ సరూప్గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులందరూ పురుషులే అని, వారితో కిల్లర్ లైంగిక చర్యలకు పాల్పడినట్లు చెప్పారు. ప్రధానంగా వారికి లిఫ్ట్ ఇచ్చిన తర్వాత, నిందితుడు ఆ వ్యక్తుల్ని దోచుకునే వాడు. డబ్బులు ఇవ్వడానికి బాధితులు నిరాకరించిన పక్షంలో వారిని చంపేవాడు. చాలా కేసుల్లో నిందితుడు, బాధితుల గొంతుకు వస్త్రాన్ని బిగించి చంపారు. కొన్ని కేసుల్లో తలకు గాయాలై చనిపోయారని అధికారులు తెలిపారు.
Also Read
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
Read Also: Indigo: రైలు అనుకున్నాడో ఏమో? విమానంలో తిరిగి ప్రయాణికులకు టీ అందించిన వ్యక్తి (వీడియో)
ఒక హత్యలో నిందితుడు చంపేసిన వ్యక్తి వీపుపై ‘ధోకేబాజ్’ (మోసగాడు) అని రాశాడు. హత్యకు గురైన వ్యక్తి ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మాజీ సైనికుడు. ఆగస్టు 18న టోల్ప్లాజా మెడ్రా వద్ద టీ, నీళ్లు అందించే 37 ఏళ్ల వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో సరూప్ మరో 10 మందిని హత్య చేసినట్ల వెల్లడైంది. ఇప్పటి వరకు 5 కేసుల్ని నిర్ధారించగా, మిగిలిన హత్యల కోసం విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు రూపనగర్, హోషియార్పూర్, ఫతేగర్ జిల్లాల ప్రజల్ని హత్య చేశాడు. కూలీ పనులు చేసుకునే కిల్లర్ డ్రగ్స్కి బానిసైనట్లు అధికారులు తెలిపారు. చంపిన తర్వాత పశ్చాత్తాపంతో మరణించిన వ్యక్తుల పాదాలకు నమస్కరించి, క్షమించమని కోరే వాడని, మద్యం మత్తులో ఉన్న తర్వాతే నేరాలకు పాల్పడుతున్నాడని నిందితుడు వెల్లడించాడు. నిందితుడికి పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారని, స్వలింగ సంపర్కం కారణంగా రెండేళ్ల క్రితం అతడి కుటుంబ సభ్యులు అతడిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేశామని, త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.
తాజావార్తలు
-
AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్లతో ప్రీమియం మూవీ ఎక్స్పీరియెన్స్కు సిద్ధం!
-
Vaibhav Sooryavanshi: ఏమో ఎవరికి తెలుసు.. వైభవ్ సూర్యవంశీ బలహీనతను అతడు కనిపెట్టామేమో!
-
108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
-
ZombieReddy2 : బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో సైలెంట్ గా స్టార్ట్ అయిన జాంబీరెడ్డి – 2
-
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!