Gwalior Murder: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఘోరం చోటుచేసుకుంది. ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్డుపై జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ఐకానిక్ రూప్ సింగ్ స్టేడియం ముందు జరిగింది. స్థానికంగా కాంట్రాక్టర్గా పనిచేస్తున్న అరవింద్ ఒకప్పటి తన లివ్ ఇన్ భాగస్వామి నందినిని అతి దారుణంగా కాల్చిచంపాడు. అరవింద్.. రూప్ సింగ్ స్టేడియం మీదుగా వెళుతున్న తన లివ్ ఇన్ పార్ట్నర్ నందినిని ఆపి.. ఆమె ముఖంపై పాయింట్-బ్లాంక్ రేంజ్లో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. తరువాత రక్తంతో తడిసి, బాధతో విలవిలలాడుతున్న నందిని పక్కనే కూర్చుని తన తుపాకీని ఊపుతూ అటువైపుగా వెళుతున్నవారందరినీ భయపెట్టాడు. దీంతో అక్కడున్నవారంతా పారిపోయారు. ఆ దారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే నిందితుడు అరవింద్ తన దగ్గరున్న తుపాకీని పోలీసుల వైపు గురిపెట్టాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి.. ఆ ప్రాంతాన్ని తమ అదుపులోనికి తీసుకున్నారు..
READ ALSO: Robbery : హైదరాబాద్ శివారులో 40 లక్షల దోపిడీ.. 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు.!
నిందితుడు అరవింద్ను అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపడి, రక్తస్రావంతో విలవిలలాడుతున్న నందినిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడు అరవింద్ తన దగ్గరున్న ఆయుధంతో తమను బెదిరించడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. అతని దగ్గరున్న తుపాకీని స్వాధీనం చేసుకున్నామన్నారు. అరవింద్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడని.. గతంలో నందినితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడని ఎస్పీ వెల్లడించారు. ఇద్దరికీ గతంలో వివాహాలు జరిగి విడాకులు కూడా తీసుకున్నారని తెలిపారు. అరవింద్ తన మొదటి వివాహాన్ని, పిల్లలున్నారనన్న సంగతిని దాచిపెట్టి, నందినిని ఆర్య సమాజ్లో మోసపూరితంగా వివాహం చేసుకున్నాడనే ఆరోపణలున్నాయన్నారు. అయితే ఆ సంబంధం ఎన్నో రోజులు నిలవలేదు. అరవింద్పై నందిని పలుమార్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి…
2024, నవంబర్లో అరవింద్ అతని స్నేహితురాలు పూజ పరిహార్తో కలసి తనపై దాడి చేశాడని నందిని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే అరవింద్ ఆమెను కారుతో ఢీకొట్టడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆమె ఆ హత్యాయత్నం నుంచి బయటపడింది. ఆమె ఫిర్యాదుతో అరవింద్ను అరెస్టు చేసినప్పటికీ.. ఆ తరువాత బెయిల్ పొంది.. నందినిని వేధిస్తూ వచ్చాడు. సెప్టెంబర్ 9న ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన నందిని అరవింద్పై పలు ఆరోపణలు చేసింది. అరవింద్ తనపై ఏఐ జనరేటెడ్ అశ్లీల వీడియోలు రూపొందిస్తూ.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నడని ఆరోపించింది. తనను చంపేస్తానని బెదిరించాడని కూడా ఆమె ఆరోపించింది.. నందిని మరోసారి ఎస్పీ కార్యాలయానికి వెళుతుండగా.. అరవింద్ ఆమెను అడ్డుకున్నాడు. తుపాకీతో ఆమె ముఖంపై అత్యంత దారుణంగా కాల్పులు జరిపాడు. ఎప్పుడూ జనం రద్దీతో కళకళలాడే రోడ్డు రక్తసిక్తంగా మారిపోయింది. పదేపదే పోలీసు రక్షణ కోరిన మహిళపై పట్టపగలు.. అదీ వీఐపీ జోన్లో చోటుచేసుకున్న దారుణం అందరినీ కలచివేస్తోంది. మహిళల రక్షణపై పలు అనుమానాలు రేకెత్తిస్తోంది..
READ ALSO: Hyderabad: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ.. బంధువుల ఇంట్లో చోరీ..
