Guntur Murder Case: మద్యం మాన్పించాలని కొడితే ప్రాణమే పోయింది.. భార్య చేతిలో భర్త హత్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur murder case: వాళ్లిద్దరూ భార్యాభర్తలు… వారికి ఒక చిన్నారి సంతానం… కూలీపనులు చేసుకుంటూ హాయిగా జీవనం కొనసాగిస్తున్నారు… మద్యం వ్యసనం ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది… సరదా అలవాటు కాస్తా వ్యసనంగా మారింది… భర్తలో మార్పుకోసం భార్య చేసిన ప్రయత్నంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని చూసింది. కానీ పోలీసుల ప్రశ్నలతో అడ్డంగా బుక్కయింది. ఇంతకీ ఈ కేసులో అసలేం జరిగిందంటే..?
READ MORE: Karimnagar SI Suicide: ఎస్సై ఆత్మహత్యకు కారణం అదేనా?
Also Read
- Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- Hyderabad: న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య వెనుక మిస్టరీ ఇంతుందా?
- Husband Murder: ఖతర్నాక్ వైఫ్.. భర్తపై 3 కోట్ల బీమా చేసి కన్నింగ్ స్కెచ్.. చివరికిలా!
ఆరేళ్ల క్రితం గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంకు చెందిన తిరుపతమ్మతో వెంకటేశ్వర రావుకు పెళ్లయింది. కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలం క్రితం పొన్నూరు నుంచి దాసరిపాలెంకు మకాం మార్చారు. గతంలో వెంకటేశ్వరరావుకు మద్యం అలవాటు ఉండేది. అయితే ఏడాదికాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో పడి కూలీపనులకు కూడా వెళ్లడం మానేశాడు. మద్యం తాగేందుకు డబ్బులకోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు భరించలేని భార్య ఇదే విషయాన్ని బంధువులకు చెప్పింది. తన భర్తలో నయానో భయానో మార్పు తీసుకురావాలని బంధువులను కోరింది. తిరుపతమ్మ బంధువులు కొంత మంది 2 రోజులక్రితం ఇంటికి వచ్చారు. ఆ సమయంలో కూడా వెంకటేశ్వరరావు మద్యం మత్తులోనే ఉన్నాడు. పద్దతి మార్చుకోవాలని బంధువులు చెప్పినా పట్టించుకోలేదు. మద్యం అలవాటు మానేసి ఎప్పటిలా ఉండమని సూచించారు. అయితే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరరావు భార్య తరపు బంధువులతో వాగ్వాదానికి దిగాడు. నీ మంచికోసమే చెబుతున్నామని చెబుతున్నా ఎవరినీ లెక్క చెయ్యలేదు. దీంతో వెంకటేశ్వరరావులో మార్పు రావాలంటే మరింత కఠినంగా వ్యవహరించాలని భావించారు. అంతే అందరూ కలిసి వెంకటేశ్వరరావుకు దేహశుద్ది చేశారు. ప్రమాదవశాత్తు తగలరానిచోట దెబ్బలు తగలడంతో వెంకటేశ్వరరావు కుప్పకూలిపోయాడు. ఆందోళనకు గురైన భార్య,బంధువులు వెంకటేశ్వరరావుకు ఏమైందోనని కంగారుపడ్డారు. వెంకటేశ్వరరావు తాము కొట్టిన దెబ్బలకు చనిపోయినట్లు గుర్తించారు..
READ MORE: Dhurandhar 2: దురంధర్ నటుల్ని భలే పట్టారే.. రీల్ vs రియల్ పిక్స్ మీకోసం!
మంచి చేద్దామని వస్తే ఇలా జరిగిందేమిటా అని అందరూ తలలు పట్టుకున్నారు. ఎలాగైనా హత్య కేసునుంచి బయడపడాలని ఆలోచించారు. అందరూ కలిసి పక్కాగా ప్లాన్ వేశారు. వెంకటేశ్వరరావు మృతదేహాన్ని తీసుకుని ఈదురుపాలెం చెరువు వద్దకు వెళ్లారు. వెంకటేశ్వరరావు మృతదేహానికి పెద్ద బండరాయి కట్టి చెరువులో పడేశారు. మరుసటిరోజు చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మృతదేహానికి బండకట్టి ఉండడంతోపాటు మృతుడి శరీరంపై గాయాలుండడంతో హత్యచేసి చెరువులో పడేసి ఉంటారని భావించారు. మృతుడు ఎవరనేదానిపై విచారణ చేపట్టిన పోలీసులు.. తర్వాత మృతుడి భార్య తిరుపతమ్మను విచారించారు. మొదట్లో తనకేమీ తెలియదని చెప్పింది. అనుమానంతో తిరుపతమ్మను పోలీసులు తమదైన స్టైల్ లో విచారించడంతో హత్య వ్యవహారం బయటపడింది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు..
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..