Guntur Murder Case: మద్యం మాన్పించాలని కొడితే ప్రాణమే పోయింది.. భార్య చేతిలో భర్త హత్య!
Guntur murder case: వాళ్లిద్దరూ భార్యాభర్తలు… వారికి ఒక చిన్నారి సంతానం… కూలీపనులు చేసుకుంటూ హాయిగా జీవనం కొనసాగిస్తున్నారు… మద్యం వ్యసనం ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది… సరదా అలవాటు కాస్తా వ్యసనంగా మారింది… భర్తలో మార్పుకోసం భార్య చేసిన ప్రయత్నంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని చూసింది. కానీ పోలీసుల ప్రశ్నలతో అడ్డంగా బుక్కయింది. ఇంతకీ ఈ కేసులో అసలేం జరిగిందంటే..?
READ MORE: Karimnagar SI Suicide: ఎస్సై ఆత్మహత్యకు కారణం అదేనా?
ఆరేళ్ల క్రితం గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంకు చెందిన తిరుపతమ్మతో వెంకటేశ్వర రావుకు పెళ్లయింది. కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలం క్రితం పొన్నూరు నుంచి దాసరిపాలెంకు మకాం మార్చారు. గతంలో వెంకటేశ్వరరావుకు మద్యం అలవాటు ఉండేది. అయితే ఏడాదికాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో పడి కూలీపనులకు కూడా వెళ్లడం మానేశాడు. మద్యం తాగేందుకు డబ్బులకోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు భరించలేని భార్య ఇదే విషయాన్ని బంధువులకు చెప్పింది. తన భర్తలో నయానో భయానో మార్పు తీసుకురావాలని బంధువులను కోరింది. తిరుపతమ్మ బంధువులు కొంత మంది 2 రోజులక్రితం ఇంటికి వచ్చారు. ఆ సమయంలో కూడా వెంకటేశ్వరరావు మద్యం మత్తులోనే ఉన్నాడు. పద్దతి మార్చుకోవాలని బంధువులు చెప్పినా పట్టించుకోలేదు. మద్యం అలవాటు మానేసి ఎప్పటిలా ఉండమని సూచించారు. అయితే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరరావు భార్య తరపు బంధువులతో వాగ్వాదానికి దిగాడు. నీ మంచికోసమే చెబుతున్నామని చెబుతున్నా ఎవరినీ లెక్క చెయ్యలేదు. దీంతో వెంకటేశ్వరరావులో మార్పు రావాలంటే మరింత కఠినంగా వ్యవహరించాలని భావించారు. అంతే అందరూ కలిసి వెంకటేశ్వరరావుకు దేహశుద్ది చేశారు. ప్రమాదవశాత్తు తగలరానిచోట దెబ్బలు తగలడంతో వెంకటేశ్వరరావు కుప్పకూలిపోయాడు. ఆందోళనకు గురైన భార్య,బంధువులు వెంకటేశ్వరరావుకు ఏమైందోనని కంగారుపడ్డారు. వెంకటేశ్వరరావు తాము కొట్టిన దెబ్బలకు చనిపోయినట్లు గుర్తించారు..
READ MORE: Dhurandhar 2: దురంధర్ నటుల్ని భలే పట్టారే.. రీల్ vs రియల్ పిక్స్ మీకోసం!
మంచి చేద్దామని వస్తే ఇలా జరిగిందేమిటా అని అందరూ తలలు పట్టుకున్నారు. ఎలాగైనా హత్య కేసునుంచి బయడపడాలని ఆలోచించారు. అందరూ కలిసి పక్కాగా ప్లాన్ వేశారు. వెంకటేశ్వరరావు మృతదేహాన్ని తీసుకుని ఈదురుపాలెం చెరువు వద్దకు వెళ్లారు. వెంకటేశ్వరరావు మృతదేహానికి పెద్ద బండరాయి కట్టి చెరువులో పడేశారు. మరుసటిరోజు చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మృతదేహానికి బండకట్టి ఉండడంతోపాటు మృతుడి శరీరంపై గాయాలుండడంతో హత్యచేసి చెరువులో పడేసి ఉంటారని భావించారు. మృతుడు ఎవరనేదానిపై విచారణ చేపట్టిన పోలీసులు.. తర్వాత మృతుడి భార్య తిరుపతమ్మను విచారించారు. మొదట్లో తనకేమీ తెలియదని చెప్పింది. అనుమానంతో తిరుపతమ్మను పోలీసులు తమదైన స్టైల్ లో విచారించడంతో హత్య వ్యవహారం బయటపడింది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు..
తాజావార్తలు
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!