Guntur Murder Case: మద్యం మాన్పించాలని కొడితే ప్రాణమే పోయింది.. భార్య చేతిలో భర్త హత్య!
Guntur murder case: వాళ్లిద్దరూ భార్యాభర్తలు… వారికి ఒక చిన్నారి సంతానం… కూలీపనులు చేసుకుంటూ హాయిగా జీవనం కొనసాగిస్తున్నారు… మద్యం వ్యసనం ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది… సరదా అలవాటు కాస్తా వ్యసనంగా మారింది… భర్తలో మార్పుకోసం భార్య చేసిన ప్రయత్నంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని చూసింది. కానీ పోలీసుల ప్రశ్నలతో అడ్డంగా బుక్కయింది. ఇంతకీ ఈ కేసులో అసలేం జరిగిందంటే..?
READ MORE: Karimnagar SI Suicide: ఎస్సై ఆత్మహత్యకు కారణం అదేనా?
Also Read
- Krishna Deer Hunting : కృష్ణ జింకల వేట.. ముగ్గురు నిందితుల అరెస్ట్..!
- Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
- Hyderabad Honeytrap: తల్లి సహకారంతోనే కొడుకుల 'రొమాంటిక్' ట్రాప్.. రంగంలోకి సీపీ సజ్జనార్
- Viral: ఒక్క రాత్రి నగ్న పూజకు కూర్చొంటే రూ.30 లక్షలు.. యువతికి ఎర వేసిన కారు డ్రైవర్..
ఆరేళ్ల క్రితం గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంకు చెందిన తిరుపతమ్మతో వెంకటేశ్వర రావుకు పెళ్లయింది. కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలం క్రితం పొన్నూరు నుంచి దాసరిపాలెంకు మకాం మార్చారు. గతంలో వెంకటేశ్వరరావుకు మద్యం అలవాటు ఉండేది. అయితే ఏడాదికాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో పడి కూలీపనులకు కూడా వెళ్లడం మానేశాడు. మద్యం తాగేందుకు డబ్బులకోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు భరించలేని భార్య ఇదే విషయాన్ని బంధువులకు చెప్పింది. తన భర్తలో నయానో భయానో మార్పు తీసుకురావాలని బంధువులను కోరింది. తిరుపతమ్మ బంధువులు కొంత మంది 2 రోజులక్రితం ఇంటికి వచ్చారు. ఆ సమయంలో కూడా వెంకటేశ్వరరావు మద్యం మత్తులోనే ఉన్నాడు. పద్దతి మార్చుకోవాలని బంధువులు చెప్పినా పట్టించుకోలేదు. మద్యం అలవాటు మానేసి ఎప్పటిలా ఉండమని సూచించారు. అయితే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరరావు భార్య తరపు బంధువులతో వాగ్వాదానికి దిగాడు. నీ మంచికోసమే చెబుతున్నామని చెబుతున్నా ఎవరినీ లెక్క చెయ్యలేదు. దీంతో వెంకటేశ్వరరావులో మార్పు రావాలంటే మరింత కఠినంగా వ్యవహరించాలని భావించారు. అంతే అందరూ కలిసి వెంకటేశ్వరరావుకు దేహశుద్ది చేశారు. ప్రమాదవశాత్తు తగలరానిచోట దెబ్బలు తగలడంతో వెంకటేశ్వరరావు కుప్పకూలిపోయాడు. ఆందోళనకు గురైన భార్య,బంధువులు వెంకటేశ్వరరావుకు ఏమైందోనని కంగారుపడ్డారు. వెంకటేశ్వరరావు తాము కొట్టిన దెబ్బలకు చనిపోయినట్లు గుర్తించారు..
READ MORE: Dhurandhar 2: దురంధర్ నటుల్ని భలే పట్టారే.. రీల్ vs రియల్ పిక్స్ మీకోసం!
మంచి చేద్దామని వస్తే ఇలా జరిగిందేమిటా అని అందరూ తలలు పట్టుకున్నారు. ఎలాగైనా హత్య కేసునుంచి బయడపడాలని ఆలోచించారు. అందరూ కలిసి పక్కాగా ప్లాన్ వేశారు. వెంకటేశ్వరరావు మృతదేహాన్ని తీసుకుని ఈదురుపాలెం చెరువు వద్దకు వెళ్లారు. వెంకటేశ్వరరావు మృతదేహానికి పెద్ద బండరాయి కట్టి చెరువులో పడేశారు. మరుసటిరోజు చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మృతదేహానికి బండకట్టి ఉండడంతోపాటు మృతుడి శరీరంపై గాయాలుండడంతో హత్యచేసి చెరువులో పడేసి ఉంటారని భావించారు. మృతుడు ఎవరనేదానిపై విచారణ చేపట్టిన పోలీసులు.. తర్వాత మృతుడి భార్య తిరుపతమ్మను విచారించారు. మొదట్లో తనకేమీ తెలియదని చెప్పింది. అనుమానంతో తిరుపతమ్మను పోలీసులు తమదైన స్టైల్ లో విచారించడంతో హత్య వ్యవహారం బయటపడింది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు..
తాజావార్తలు
-
West Bengal New Assembly: పశ్చిమ బెంగాల్ కొత్త శాసనసభ ఏర్పాటుకు మార్గం సుగమం.. ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన జారీ
-
Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం.. ఈదురుగాలులకు ముగ్గురు రైతుల మృతి..
-
NTRNEEL : ఎన్టీఆర్ – ప్రశాంత్ సినిమా డైలాగ్ రైటర్ గా దేవాకట్టా
-
Vivek Agnihotri: మమతా బెనర్జీ ఓటమిపై వివేక్ అగ్నిహోత్రి సంచలన పోస్ట్..
-
IPL Ticket Scam Hyderabad: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల స్కామ్ బట్టబయలు.. అభిమానులకు పోలీసులు హెచ్చరికలు!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!