Guntur Murder Case: మద్యం మాన్పించాలని కొడితే ప్రాణమే పోయింది.. భార్య చేతిలో భర్త హత్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur murder case: వాళ్లిద్దరూ భార్యాభర్తలు… వారికి ఒక చిన్నారి సంతానం… కూలీపనులు చేసుకుంటూ హాయిగా జీవనం కొనసాగిస్తున్నారు… మద్యం వ్యసనం ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది… సరదా అలవాటు కాస్తా వ్యసనంగా మారింది… భర్తలో మార్పుకోసం భార్య చేసిన ప్రయత్నంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని చూసింది. కానీ పోలీసుల ప్రశ్నలతో అడ్డంగా బుక్కయింది. ఇంతకీ ఈ కేసులో అసలేం జరిగిందంటే..?
READ MORE: Karimnagar SI Suicide: ఎస్సై ఆత్మహత్యకు కారణం అదేనా?
Also Read
- Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
ఆరేళ్ల క్రితం గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంకు చెందిన తిరుపతమ్మతో వెంకటేశ్వర రావుకు పెళ్లయింది. కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలం క్రితం పొన్నూరు నుంచి దాసరిపాలెంకు మకాం మార్చారు. గతంలో వెంకటేశ్వరరావుకు మద్యం అలవాటు ఉండేది. అయితే ఏడాదికాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో పడి కూలీపనులకు కూడా వెళ్లడం మానేశాడు. మద్యం తాగేందుకు డబ్బులకోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు భరించలేని భార్య ఇదే విషయాన్ని బంధువులకు చెప్పింది. తన భర్తలో నయానో భయానో మార్పు తీసుకురావాలని బంధువులను కోరింది. తిరుపతమ్మ బంధువులు కొంత మంది 2 రోజులక్రితం ఇంటికి వచ్చారు. ఆ సమయంలో కూడా వెంకటేశ్వరరావు మద్యం మత్తులోనే ఉన్నాడు. పద్దతి మార్చుకోవాలని బంధువులు చెప్పినా పట్టించుకోలేదు. మద్యం అలవాటు మానేసి ఎప్పటిలా ఉండమని సూచించారు. అయితే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరరావు భార్య తరపు బంధువులతో వాగ్వాదానికి దిగాడు. నీ మంచికోసమే చెబుతున్నామని చెబుతున్నా ఎవరినీ లెక్క చెయ్యలేదు. దీంతో వెంకటేశ్వరరావులో మార్పు రావాలంటే మరింత కఠినంగా వ్యవహరించాలని భావించారు. అంతే అందరూ కలిసి వెంకటేశ్వరరావుకు దేహశుద్ది చేశారు. ప్రమాదవశాత్తు తగలరానిచోట దెబ్బలు తగలడంతో వెంకటేశ్వరరావు కుప్పకూలిపోయాడు. ఆందోళనకు గురైన భార్య,బంధువులు వెంకటేశ్వరరావుకు ఏమైందోనని కంగారుపడ్డారు. వెంకటేశ్వరరావు తాము కొట్టిన దెబ్బలకు చనిపోయినట్లు గుర్తించారు..
READ MORE: Dhurandhar 2: దురంధర్ నటుల్ని భలే పట్టారే.. రీల్ vs రియల్ పిక్స్ మీకోసం!
మంచి చేద్దామని వస్తే ఇలా జరిగిందేమిటా అని అందరూ తలలు పట్టుకున్నారు. ఎలాగైనా హత్య కేసునుంచి బయడపడాలని ఆలోచించారు. అందరూ కలిసి పక్కాగా ప్లాన్ వేశారు. వెంకటేశ్వరరావు మృతదేహాన్ని తీసుకుని ఈదురుపాలెం చెరువు వద్దకు వెళ్లారు. వెంకటేశ్వరరావు మృతదేహానికి పెద్ద బండరాయి కట్టి చెరువులో పడేశారు. మరుసటిరోజు చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మృతదేహానికి బండకట్టి ఉండడంతోపాటు మృతుడి శరీరంపై గాయాలుండడంతో హత్యచేసి చెరువులో పడేసి ఉంటారని భావించారు. మృతుడు ఎవరనేదానిపై విచారణ చేపట్టిన పోలీసులు.. తర్వాత మృతుడి భార్య తిరుపతమ్మను విచారించారు. మొదట్లో తనకేమీ తెలియదని చెప్పింది. అనుమానంతో తిరుపతమ్మను పోలీసులు తమదైన స్టైల్ లో విచారించడంతో హత్య వ్యవహారం బయటపడింది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు..
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?