NTV Telugu Site icon

Crime News: ఛీఛీ.. కామ పిశాచులు.. పాతిపెట్టిన శవంపై గ్యాంగ్ రేప్.. చివరికి

Crime

Crime

Crime News: ప్రపంచం రోజుకో రంగు పులుముకుంటూ.. మారుతూ వస్తుంది. టెక్నాలజీ పెరుగుతూ వస్తుంది. కానీ, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం మారడం లేదు. అమ్మాయి కనిపిస్తే చాలు కొంతమంది మగాళ్లు కామాంధులుగా మారుతున్నారు. గుడి అని లేదు.. బడి అని లేదు. తల్లి అని లేదు.. చెల్లి అని లేదు.. చివరికి కూతురు అన్న ఇంగితం కూడా లేకుండా కామాంధులు మహిళలను చిత్ర హింసలు పెడుతూ లైంగికంగా వేధిస్తున్నారు. తాజాగా కొందరు కామాంధులు.. కాదు కాదు కామ పిశాచులు.. బతికున్న వారినే కాదు చనిపోయిన శవాన్ని కూడా వదిలిపెట్టలేదు. పాతిపెట్టిన శవాన్ని బయటికి తీసి సామూహిక అత్యాచారం చేసిన అతి దారుణమైన ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని సికార్ జిల్లాలో ఒక మహిళ రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమెకు గతరాత్రి స్మశానంలో అంత్యక్రియలు నిర్వహించి కుటుంబ సభ్యులు వెనుతిరిగారు. ఇక అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు.. తాంత్రిక విద్యల పేరుతో స్మశానంలోకి చొరబడి.. అప్పుడే పాతిపెట్టిన మహిళ శవాన్ని వెలికితీశారు. అనంతరం ఆ శవంపై అత్యాచారం చేసారు. ఇక అర్ధరాత్రి స్మశానంలో మాటలు వినిపించడంతో చుట్టుపక్కల వారు అనుమానించి చూడగా.. మహిళ శవంపై కామాంధులు చేస్తున్న అకృత్యం బయటపడింది. వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ కామ పిశాచులను అరెస్ట్ చేశారు. అయితే వారు నిజంగా అత్యాచారం చేయడానికి వచ్చారా..? లేక తాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి వచ్చారా..? అనే దిశగా పోలీసులు విచారిస్తున్నారు.