Tragedy : పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య
- గద్వాల జిల్లాలో మేఘాలయ తరహా మర్డర్
- గత నెల 17న కర్నూలుకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్న తేజేశ్వర్
- తేజేశ్వర్ హత్య వెనుక భార్య ఉందని అనుమానాలు
- కర్నూలులోని ఓ బ్యాంకు మేనేజర్ పాత్ర ఉందని బంధువుల ఆరోపణ
Tragedy : ఇటీవల మేఘాలయలో చోటు చేసుకున్న రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న హత్య కేసు సంచలనంగా మారింది. పెళ్లైన కొన్ని రోజులకే భర్తను అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఈ ప్రాంతాన్ని షాక్కు గురి చేసింది. 33 ఏళ్ల తేజస్విన్ అనే సర్వేయర్ను ప్లాన్ చేసిన విధంగా కత్తులతో పొడిచి హత్య చేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తేజస్విన్ భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమల్ రావు ఈ ఘోర నేరం వెనుక ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
గత నెల 17న తేజస్విన్ను “భూమి కొలవాలి” అంటూ ముగ్గురు వ్యక్తులు పిలిపించారు. పూడూరు శివారులో కారులోనే అతడిని కత్తులతో దారుణంగా హతమార్చారు. అనంతరం అతడి మృతదేహాన్ని నంద్యాల జిల్లా పాణ్యం ప్రాంతంలో పడేసి పరారయ్యారు. కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమల్ రావుతో తేజస్విన్ అత్త సుజాత గత కొంత కాలంగా సహజీవనం చేస్తోంది. అంతేకాకుండా.. ఐశ్వర్యతో కూడా తిరుమల్ రావుకు అక్రమ సంబంధం కొనసాగుతోంది. అయితే.. ఇద్దరి మధ్య పెరిగిన అనుబంధం నేపథ్యంలో తేజస్విన్ అడ్డంకిగా మారాడని భావించి, అతడి హత్యకు పాల్పడ్డారనే అనుమానం బలంగా వినిపిస్తోంది.
Also Read
- IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Brazilian Athlete: స్విమ్ రేస్ లో ప్రముఖ బ్రెజిలియన్ అథ్లెట్ మృతి..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
Chiranjeevi : ఓటిటి ఎంట్రీపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
గతంలో ఐశ్వర్యను తిరుమల్ రావు పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. తిరుమల్ రావు భార్య నిరాకరణ కారణంగా ఐశ్వర్యను తాత్కాలికంగా వెనక్కి పంపినట్టు తెలిసింది. అయితే, ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, అన్ని పాత్రలు బయటపడే వరకు ఈ కేసు మరింత మిస్టరీగా మారనుంది. వివాహేతర సంబంధం, ఆస్తి లావాదేవీలు, అనుభవాలు, అనుమానాలు కలిసి ఒక అమాయకుడి జీవితాన్ని బలిగొన్నాయి. మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ ఘటనను తలపించేలా, ఇది కూడా ప్రేమ పేరుతో జరిగిన పాశవిక నేరంగా మారింది.
Vijayawada: గోల్డ్ మార్కెట్లో 650గ్రా.ల బంగారంతో వ్యక్తి పరార్..!
తాజావార్తలు
-
8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..
-
Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
-
Mohsin Khan: “మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్”.. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
-
CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?