NTV Telugu Site icon

MP: ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురి మృతి..హత్య, ఆత్మహత్య అనే కోణాల్లో దర్యాప్తు

New Project (18)

New Project (18)

మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రౌడీ గ్రామంలో భర్త, భార్య, ముగ్గురు పిల్లల మృతదేహాలు ఉరివేసుకుని కనిపించాయి. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులుసంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అలీరాజ్‌పూర్ ఎస్పీ రాజేష్ వ్యాస్ సమాచారం ప్రకారం.. గునేరి పంచాయతీ రౌడీ గ్రామంలోని ఓ ఇంట్లో రాకేష్ సింగ్, భార్య లలిత, కుమార్తె లక్ష్మి, కుమారుడు ప్రకాష్, అక్షయ్ మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. కొందరు గ్రామస్తులు హత్య చేసి మృతదేహాలను వేలాడదీస్తారేమోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: US Politics: యూఎస్ రిపబ్లికన్ పార్టీలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి కీలక బాధ్యత..

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్య, ఆత్మహత్య కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ పరిసరాల్లో నివసించే వారి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. హత్యేనని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. సోమవారం ఉదయం బంధువులు ఇంటికి చేరుకోగా.. ఐదుగురి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. అనంతరం చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయంలో బీజేపీ మండల అధ్యక్షుడు జైపాల్ సింగ్ మాట్లాడుతూ.. ఈ కుటుంబం ఆత్మహత్యలాంటి అడుగు ముందుకు వేయదని.. ఇది హత్య అని అన్నారు. దీనిపై పోలీసులు త్వరగా విచారణ జరపాలని కోరారు.