Maharashtra: నాసిక్లో దారుణం.. వ్యక్తిని చంపి తలతో పోలీసుల ఎదుట లొంగిపోయిన తండ్రి, కొడుకు
- మహారాష్ట్రలోని నాసిక్లో దారుణం
- వ్యక్తిని చంపి తలతో పోలీసుల ఎదుట లొంగిపోయిన తండ్రి, కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని నాసిక్లో దారుణం జరిగింది. ఇరు కుటుంబాల తగాదాలతో ఓ వ్యక్తిని హత్య చేశారు. అనంతరం మొండెం నుంచి తలను వేరుచేసి ఇద్దరు నిందితులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఉద్రిక్తతలు ఏర్పడడంతో పోలీసులు మోహరించారు.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా దిండోరి తాలూకాలోని నానాషి గ్రామంలో సురేష్ బోకె(40), పొరుగువాడైన గులాబ్ రామచంద్ర వాగ్మారే(35) మధ్య చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. ఇక డిసెంబర్ 31, 2024న ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటనతో సురేష్ బోకె కుటుంబం పగతో రగిలిపోయింది. అంతే న్యూఇయర్ వేళ.. బుధవారం ఉదయం సురేష్ బోకె, అతని కుమారుడు… గులాబ్ రామచంద్ర వాగ్మారేను గొడ్డలితో నరకగా ఘటనాస్థలిలోనే ప్రాణాలు పోయాయి. అంతటితో ఆగకుండా కత్తితో పీక కత్తిరించి తలను తీసుకుని గురువారం తండ్రి, కొడుకు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు.
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహంతో నిందితుల ఇల్లును, కారును ధ్వంసం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ల సిబ్బందితో పాటు స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్ఆర్పీఎఫ్) సిబ్బంది గ్రామంలో మోహరించారు. నిందితులు ఆయుధాలు, తలను తీసుకుని నానాషి అవుట్పోస్ట్ పోలీసు చౌకీకి చేరుకున్నారని ఒక అధికారి తెలిపారు.
ఇక బాధితురాలి భార్య మినాబాయి (34) ఇచ్చిన ఫిర్యాదు మేరకు 103 (1) (హత్య), 352 (శాంతి భంగం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 351 (2) (3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు బోకెను అరెస్ట్ చేశారు. అలాగే అతడి కుమారుడు కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక భద్రతా కారణాల నేపథ్యంలో నిందితులను దిండోరి పోలీసులకు అప్పగించారు. గురువారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
iQOO 15T: ఐకూ 15T వచ్చేస్తోంది.. 200MP ప్రధాన కెమెరా, 8000mAh బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు
-
Mohsin Naqvi: ఐపీఎల్ ఫైనల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీని బీసీసీఐ ఆహ్వానించిందా? క్లారిటీ ఇదిగో..
-
Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
-
David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ నుంచి క్రేజీ లీక్ వైరల్!
-
Sunil Narine: ఇంకా చాలా మ్యాచ్లు ఆడాలని ఉంది.. ఒక్కసారిగా ఏడ్చేసిన కేకేఆర్ స్టార్ సునీల్ నరైన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..