Murder : ఏలూరులో ఆస్తి వివాదంలో తల్లిపై కొడుకు దాడి
- లక్ష్మీనరసమ్మకు ఓ కొడుకు, కూతురు
- ఇటీవలే భర్త మృతితో ఒంటరిగా జీవితం
- భార్యతో కలిసి వేరుగా ఉంటున్న కొడుకు శివాజీ
- ఇల్లుతోపాటు మిగతా ఆస్తులు తన పేరిట రాయాలని శివాజీ వేధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్న తల్లి అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ కొంత మందికి ఆస్తులపై ఉన్న ప్రేమ.. సొంత వారు.. కన్నవారిపైన ఉండడం లేదు. పైగా తుచ్ఛమైన డబ్బు, ఆస్తుల కోసం కన్నవారిని హత్య చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. కానీ ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఓ కసాయి కొడుకు.. కన్న తల్లిపైనే కొడవలి ఎత్తాడు. తుచ్ఛమైన ఆస్తి కోసం తల్లిని చంపేందుకు కూడా వెనుకాడ లేదు..
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఉంటున్న జక్కు లక్ష్మీనరసమ్మకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కూతురుకు చాలా కాలం క్రితమే వివాహమైంది. ఇటీవలే భర్త మృతి చెందాడు. కొడుకుకు కూడా పెళ్లి చేసింది. కానీ భార్యతో కలిసి వేరే కాపురం ఉంటున్నాడు కొడుకు శివాజీ. ఐతే లక్ష్మీ నరసమ్మ మాత్రం తన సొంత ఇంటిలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె ఉంటున్న ఇల్లుతోపాటు మిగతా ఆస్తులు తన పేరిట రాయాలని శివాజీ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. ఆమెను వాటి కోసం వేధిస్తున్నాడు..
Also Read
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
- Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
నిజానికి శివాజీ.. దేవరపల్లి మండలం బుచ్చయ్యపాలెంలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. కానీ తన పని మానేసి.. ఆస్తులు కావాలని తల్లి వెంట పడ్డాడు. ఆమె అంగీకరించకపోవడంతో కొయ్యలగూడెంలో పట్టపగలే అందరూ చూస్తుండగానే రోడ్డు మీద తల్లిపై కొడవలితో దాడి చేశాడు. దీంతో ఆమె తల, మెడతోపాటు శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా రక్తస్రావంతో అక్కడే ఆమె కుప్ప కూలిపోయింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం కాకినాడ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు… తల్లి లక్ష్మీనరసమ్మపై హత్యా యత్నం చేసిన కొడుకు శివాజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నాడు. ఆస్తుల కోసం కన్న తల్లి మీద దాడి చేసిన కొడుకును కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!