Woman Killed By Grandson: సినిమా స్ఫూర్తితో.. నానమ్మను కిరాతకంగా చంపిన మనవడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elderly Woman Killed By Her Song and Grandson For Assets: పూణెలో దారుణం చోటు చేసుకుంది. తనని అల్లారముద్దుగా పెంచిన నానమ్మ అని కూడా చూడకుండా.. అత్యంత కిరాతకంగా చంపాడు ఓ మనవడు. అతనికి తండ్రి సహాయం చేయడం ఇంకా అమానుషం. ఆమె పేరు మీదున్న ఆస్తిని కాజేయడం కోసమే.. ఓ సినిమా స్ఫూర్తితో ఈ కిరాతక పనికి పాల్పడ్డారు ఆ తండ్రీకొడుకులు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆర్మీ క్యాంప్లో పని చేసిన ఉషా విఠల్ గైక్వాడ్ (64).. పదవీ విరమణ అనంతరం కేశవనగర్లో స్థిరపడ్డారు. ఆమెతో పాటు కొడుకు సందీప్ గైక్వాడ్ (45), కోడలు, మనవడు సాహిల్ గైక్వాడ్ (20) ఉంటున్నారు. ఈనెల 5వ తేదీన అత్తతో గొడవ పడి, కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
అదే రోజు మధ్యాహ్నం ఉషా విఠల్ నిద్రపోతుండగా.. మనవడు సాహిల్ ఆమెను స్నానాల గదిలోకి లాక్కెళ్లి, గొంతు నులిమి చంపేశాడు. ఈ విషయాన్ని తన తండ్రి సందీప్కి చెప్పాడు. కొడుకు చేసిన ఈ కిరాతక పనికి శిక్షించడం పోయి, అతనికి సహాయం చేశాడు ఆ తండ్రి. చంపింది తన తల్లినే అయినా, ఆస్తి దక్కుతుంది కదా అని, కొడుక్కి సహాయం చేశాడు. ఆమె మృతదేహాన్ని పాతిపెట్టేందుకు.. తండ్రీకొడుకులు కలిసి ఒక ప్లాన్ వేశారు. చెట్లను నరికే ఎలక్ట్రిక్ కటర్తో ఉషా విఠల్ మృతదేహాన్ని 9 ముక్కలుగా కత్తిరించారు. ఆ ముక్కల్ని సంచుల్లో కుక్కి, దగ్గరలో ఉన్న ముథా నదిలో పడేశారు. పక్కనే ఉన్న చెత్త డిపోలో మరో బ్యాగ్ వదిలేశారు. కత్తి, దుస్తుల్ని నది ఒడ్డున పారేసి, ఏమీ ఎరుగనట్టుగా ఇంటికి వెళ్లిపోయారు. అంతేకాదు, ఆమె మిస్ అయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 10వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు.
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
రోజులు గడిచినా ఉషా విఠల్ ఆచూకీ కనిపించకపోవడంతో.. ఆమె కుమార్తెకు తన అన్నయ్య సందీప్ గైక్వాడ్ మీద అనుమానం వచ్చింది. దీంతో ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించగా.. అసలు నిజం బయటపడింది. ఉషా విఠల్ కొడుకు సందీప్, మనవడు సాహిల్ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. నానమ్మ ఆస్తి కోసమే తాను ఈ హత్య చేశానని, ఓ మలయాళ సినిమా రీమేక్ చూశాక తనకు ఈ ఆలోచన వచ్చిందని సాహిల్ అంగీకరించాడు. పోలీసులు ఆ తండ్రీకొడుకుల్ని రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..