Woman Killed By Grandson: సినిమా స్ఫూర్తితో.. నానమ్మను కిరాతకంగా చంపిన మనవడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elderly Woman Killed By Her Song and Grandson For Assets: పూణెలో దారుణం చోటు చేసుకుంది. తనని అల్లారముద్దుగా పెంచిన నానమ్మ అని కూడా చూడకుండా.. అత్యంత కిరాతకంగా చంపాడు ఓ మనవడు. అతనికి తండ్రి సహాయం చేయడం ఇంకా అమానుషం. ఆమె పేరు మీదున్న ఆస్తిని కాజేయడం కోసమే.. ఓ సినిమా స్ఫూర్తితో ఈ కిరాతక పనికి పాల్పడ్డారు ఆ తండ్రీకొడుకులు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆర్మీ క్యాంప్లో పని చేసిన ఉషా విఠల్ గైక్వాడ్ (64).. పదవీ విరమణ అనంతరం కేశవనగర్లో స్థిరపడ్డారు. ఆమెతో పాటు కొడుకు సందీప్ గైక్వాడ్ (45), కోడలు, మనవడు సాహిల్ గైక్వాడ్ (20) ఉంటున్నారు. ఈనెల 5వ తేదీన అత్తతో గొడవ పడి, కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
అదే రోజు మధ్యాహ్నం ఉషా విఠల్ నిద్రపోతుండగా.. మనవడు సాహిల్ ఆమెను స్నానాల గదిలోకి లాక్కెళ్లి, గొంతు నులిమి చంపేశాడు. ఈ విషయాన్ని తన తండ్రి సందీప్కి చెప్పాడు. కొడుకు చేసిన ఈ కిరాతక పనికి శిక్షించడం పోయి, అతనికి సహాయం చేశాడు ఆ తండ్రి. చంపింది తన తల్లినే అయినా, ఆస్తి దక్కుతుంది కదా అని, కొడుక్కి సహాయం చేశాడు. ఆమె మృతదేహాన్ని పాతిపెట్టేందుకు.. తండ్రీకొడుకులు కలిసి ఒక ప్లాన్ వేశారు. చెట్లను నరికే ఎలక్ట్రిక్ కటర్తో ఉషా విఠల్ మృతదేహాన్ని 9 ముక్కలుగా కత్తిరించారు. ఆ ముక్కల్ని సంచుల్లో కుక్కి, దగ్గరలో ఉన్న ముథా నదిలో పడేశారు. పక్కనే ఉన్న చెత్త డిపోలో మరో బ్యాగ్ వదిలేశారు. కత్తి, దుస్తుల్ని నది ఒడ్డున పారేసి, ఏమీ ఎరుగనట్టుగా ఇంటికి వెళ్లిపోయారు. అంతేకాదు, ఆమె మిస్ అయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 10వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు.
Also Read
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
రోజులు గడిచినా ఉషా విఠల్ ఆచూకీ కనిపించకపోవడంతో.. ఆమె కుమార్తెకు తన అన్నయ్య సందీప్ గైక్వాడ్ మీద అనుమానం వచ్చింది. దీంతో ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించగా.. అసలు నిజం బయటపడింది. ఉషా విఠల్ కొడుకు సందీప్, మనవడు సాహిల్ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. నానమ్మ ఆస్తి కోసమే తాను ఈ హత్య చేశానని, ఓ మలయాళ సినిమా రీమేక్ చూశాక తనకు ఈ ఆలోచన వచ్చిందని సాహిల్ అంగీకరించాడు. పోలీసులు ఆ తండ్రీకొడుకుల్ని రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!