MBNR + KP VISHADALU: కాపురాలు.. విషాదాలు..
- ఇద్దరు కుమారులను చంపేసి స్రవంతి బలవన్మరణం
- కొన్ని నెలల నుంచి దంపతుల మధ్య గొడవలు
- ప్రవీణ్ మరో యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు
- రంగారెడ్డి జిల్లాలో మరో దారుణ ఘటన
- తాగిన మత్తులో భార్య, కుమారుడు, కూతురిపై కత్తితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MBNR + KP VISHADALU: చిన్నపాటి సంఘటనలు.. క్షణికావేశం.. లేదా మద్యంచిచ్చు.. కారణాలు ఏవైనా కావచ్చు… కుటుంబాల్లో మాత్రం విషాదం నెలకొంటోంది. క్షణికావేశంలో పిల్లల్ని చంపి కుటుంబ పెద్దలు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. తాజాగా కూకట్పల్లి, రంగారెడ్డి జిల్లాల్లో అలాంటి దారుణాలే జరిగాయి. వివాహేతర బంధాలు.. భార్య, భర్త మధ్య గొడవలు.. మనస్పర్థల కారణంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గొడవల నుంచి శాశ్వతంగా బయటపడేందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కానీ చాలా కేసుల్లో ఏ మాత్రం సంబంధం లేని పిల్లలను సైతం సమిధలుగా మార్చుతున్నారు. తల్లిదండ్రుల కోపతాపాలకు పిల్లలు బలవుతున్నారు. తాజాగా కూకట్పల్లిలోనూ అదే జరిగింది.
కైతలాపూర్లో స్రవంతి అనే వివాహిత ఇద్దరు కుమారులు కౌశిక్, కార్తీక్ను చంపేసి ఆమె బలవన్మరణానికి పాల్పడింది. వైవాహిక జీవితంలో చాలా రోజుల నుంచి జరుగుతున్న గొడవలే దీనికి కారణంగా తెలుస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన బానోత్ ప్రవీణ్.. కొన్నాళ్ల క్రితం స్రవంతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కొడుకులు పుట్టారు. గత కొన్ని నెలల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రవీణ్.. మరో యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. దీనిపై స్రవంతి నిత్యం ప్రవీణ్తో గొడవపడేది. ఈ క్రమంలోనే తన వైవాహిక జీవితంపై మానసికంగా కుంగిపోయిన స్రవంతి.. ప్రవీణ్ డ్యూటీకి వెళ్లగానే కఠిన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు కుమారులను హత్య చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగి వచ్చిన ప్రవీణ్, స్థానికుల సహకారంతో ఇంటికి ప్రవేశించి విషాదాన్ని చూడటంతో షాక్లో పడిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం మరియు పోలీసులు మృతదేహాలను శవ పరీక్షకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
మరోవైపు రంగారెడ్డి జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. ఆమనగల్ మండలం పులిగోనిపల్లి తండాలో తాగిన మత్తులో ఉన్న బాణావత్ రాందాస్ నాయక్ తన భార్య, కుమారుడు, కూతురిపై కత్తితో దాడి చేశాడు. దాడిలో భార్య , కుమారుడు మృతి చెందగా.. కూతురు గాయాలతో ఆస్పత్రి పాలైంది. పులిగోనిపల్లి తండాకు చెందిన రాందాస్ నాయక్ ఆమనగల్ కాటన్ మిల్లులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాందాస్, కవిత.. ఇద్దరికి వివాహమైంది. వారిద్దరికీ నలుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు ఉన్నారు. రాందాస్ నాయక్ తాగుడుకు బానిసయ్యాడు. దీంతో పెళ్లి అయినప్పటి నుంచి తరచు భార్యాభర్తలు గొడవ పడుతుండే వారని గ్రామస్తులు అంటున్నారు. ఆ గొడవ కాస్త కుటుంబ హత్యకు దారి తీసింది. రాందాస్ నాయక్ అతి దారుణంగా కన్న పిల్లలను.. భార్యను.. కనికరం లేకుండా కత్తితో గొంతు కోసి అతికిరాతకంగా హత్య చేశారు. భార్య కవిత, బాబు హర్షిత్ అక్కడక్కడే మృతి చెందారు. కూతురు ప్రణీత పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మరోఇద్దరు అమ్మాయిలు అమ్మమ్మ గారి దగ్గర ఉండడంతో ప్రాణాలతో బతికి బయట పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా భార్య, భర్త మధ్య నెలకొన్న విభేదాలు, గొడవల కారణంగా రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. మరోవైపు.. స్రవంతి మృతితో ఆమె బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో బాణోత్ ప్రవీణ్ ఇంటికి వారు నిప్పు పెట్టారు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..