Digital Arrest Scam: ఏకంగా ఎమ్మెల్యేనే ముంచేశారు కదరా.. రూ.31 లక్షలు స్వాహా చేసిన స్కామర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digital Arrest Scam: ఈ మధ్య తరుచు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎందరినో స్కామర్లు దోచుకుంటున్న విషయాలు చూస్తూనే ఉన్నాము. ఇలా స్కాంలో తాజాగా చిక్కుకున్న కర్ణాటక మాజీ ఎమ్మెల్యే గుండప్ప వకిల్ ఎనిమిది రోజుల్లో దాదాపు రూ. 31 లక్షలు పోగొట్టుకున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP), ఒక న్యాయమూర్తిగా నటిస్తూ మోసగాళ్లు ఈ కుట్రకు పాల్పడ్డారు.
అసలేమైందన్న విషయానికి వస్తే.. ఆగస్టు 12 సాయంత్రం ఒక నకిలీ సీబీఐ అధికారి గుండప్ప వకిల్కు ఫోన్ చేసి.. వ్యాపారవేత్త నరేష్ గోయల్ సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆయన పేరు కూడా ఉందని చెప్పారు. సీబీఐ అధికారులు జప్తు చేసిన వాటిలో గుండప్ప పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డు ఉన్నాయని, ఇవి నిధుల దుర్వినియోగానికి సంబంధించినవని ఆ మోసగాడు తెలిపాడు. ఆ తర్వాత, నకిలీ సీబీఐ అధికారి బాధితుడి వ్యక్తిగత వివరాలు, ఆస్తుల వివరాలు అడిగి తీసుకున్నాడు.
Also Read
- Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
- Extramarital affairs: అలా వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. చివరికిలా..!
- Fake Experience Certificates & CVs: ఫేక్ CV, ఫేక్ సాలరీ స్లిప్లతో జాబ్ కొట్టేశారా?.. తర్వాత ఎదురయ్యే చట్టపరమైన చిక్కులు తెలుసా?
- Bengaluru Murder: మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి.. ఇంట్లోనే వదిలేసి తాళం వేశాడు..బెంగళూరులో ప్రకంపనలు రేపుతోన్న వివాహిత మరణం!
YS Jagan Mohan Reddy: మెడికల్ కాలేజీలను చంద్రబాబు పప్పుబెల్లాలకు అమ్ముకుంటున్నారు..
ఆ తర్వాత, ఆ కాల్ను నీరజ్ కుమార్ అనే వ్యక్తికి బదిలీ చేశారు. అతను తనను తాను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పరిచయం చేసుకుని, గుండప్ప వకిల్ను ‘డిజిటల్ అరెస్ట్’ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ కాల్ కట్ చేయకూడదని బాధితుడికి గట్టిగా సూచించాడు. ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో, మోసగాళ్లు బాధితుడిని వీడియో కాల్ ద్వారా ‘న్యాయమూర్తి’ ముందు హాజరుపరిచారు. తాను ఎలాంటి మోసాలకు పాల్పడలేదని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని ఆ ‘న్యాయమూర్తి’ గుండప్పను ఆదేశించాడు. అంతేకాకుండా, RTGS ద్వారా రూ. 10.99 లక్షలను ఒక బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించాడు.
ఆ తర్వాత నీరజ్ కుమార్, మరో అధికారి సందీప్ కుమార్ అనే వ్యక్తులు ప్రతిరోజూ గుండప్ప వకిల్ను ఫోన్ చేస్తూ, దర్యాప్తు పేరుతో ఆయనను.. వారితోపాటు ఆయన కుటుంబ సభ్యుల బ్యాంక్ వివరాలను సేకరించారు. కొద్ది రోజుల తర్వాత, ఎమ్మెల్యేను మరోసారి వీడియో కాల్ ద్వారా ‘న్యాయమూర్తి’ ముందు హాజరుపరిచారు. ఈసారి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), సీబీఐ దర్యాప్తు కోసం రూ. 20 లక్షలు బదిలీ చేయాలని ఆదేశించారు. డబ్బు బదిలీ చేస్తే, విచారణ పూర్తయ్యాక తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు ఆ డబ్బును కూడా బదిలీ చేశాడు.
చివరకు డబ్బు తిరిగి రాకపోవడం, మోసగాళ్ల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో 73 ఏళ్ల గుండప్ప వకిల్ తాను ‘డిజిటల్ అరెస్ట్’ కు బలైపోయానని గ్రహించారు. సెప్టెంబర్ 6న, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఈ విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
OTR : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి తలనొప్పిగా మారారా?
-
Story Board : బ్యాంక్ అకౌంట్ ఉంటే బాదుడు తప్పదా..?
-
Ponguleti Srinivas Reddy: ధరణి అక్రమాలు, భూ సమస్యలపై సెట్ విచారణ
-
Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
-
Operation Muskaan : ‘ఆపరేషన్ ముస్కాన్’ సక్సెస్.. 6,307 మంది చిన్నారులకు కొత్త జీవితం.!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!