Cyber Fraud : వృద్ధుడి ఆధార్ కార్డు మానవ అక్రమ రవాణా కేసుల్లో
- డిజిటల్ అరెస్ట్.. ఇది సైబర్ క్రిమినల్స్కు కీలకమైన పదం
- 2025 జులై 12న బాధితుడికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్
- తాను TRAI అధికారినని చెప్పుకున్న అవతలి వ్యక్తి
- వృద్ధుడి ఆధార్ కార్డును మానవ అక్రమ రవాణా కేసుల్లో వాడినట్లు వెల్లడి
- కంబోడియా, మయన్మార్, ఫిలిప్పీన్స్ కేసులు నమోదైనట్లు వెల్లడి
- కెనెరా బ్యాంక్ ఏటీఎం కార్డు, నకిలీ సుప్రీం కోర్టు నోటీస్ చూపించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య వృద్ధులే లక్ష్యంగా అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో సైబర్ నేరగాళ్ల ఆటకు మరో వృద్ధుడు దారుణంగా మోసపోయాడు. అతని వద్ద నుంచి ఏకంగా రూ. 80 లక్షలు కొట్టేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో 3 రోజులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసేశారు. డిజిటల్ అరెస్ట్.. ఇది సైబర్ క్రిమినల్స్కు చాలా కీలకమైన పదం. దీన్ని ఉపయోగించి అమాయకులైన వారిని టార్గెట్ చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ వృద్ధున్ని ఇలాగే మోసం చేశారు…
2025 జులై 12న బాధితుడికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనకు తాను TRAI అధికారినని చెప్పుకున్నాడు. వృద్ధుడి ఆధార్ కార్డు ఆయనకే చూపించారు. అంతే కాదు ఆ ఆధార్ కార్డును మానవ అక్రమ రవాణా కేసుల్లో వాడారని చెప్పారు. దీనిపై కంబోడియా, మయన్మార్, ఫిలిప్పీన్స్ దేశాల్లో సైబర్ నేరాలకు సంబంధించి కేసు నమోదైందని చెప్పుకొచ్చారు. అంతే కాదు ఈ విషయంలో ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారని భయపెట్టారు. ఇక తాము చెప్పిన దానికి రుజువులు అన్న విధంగా గతంలో వృద్ధుడి పేరు మీద ఉన్న కెనెరా బ్యాంక్ ఏటీఎం కార్డుతోపాటు నకిలీ సుప్రీం కోర్టు నోటీస్ చూపించారు. ఈ కేసులో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించారు..
Also Read
- Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
- ATM Cash Van : ఏటీఎంలో డబ్బులు పెట్టాల్సినోడు.. తన జేబులో వేసుకుని జంప్.!
అప్పటికే కేటుగాళ్ల మాటలు నమ్మిన వృద్దుడు తీవ్రంగా భయాందోళనకు గురయ్యాడు. నిజానికి గతంలో బ్యాంక్ ఉద్యోగిగా పని చేసి రిటైరైనప్పటికీ.. కేటుగాళ్లు చెప్పిన విధంగా ఫాలో అయ్యాడు. కేసుల నుంచి విముక్తి కలిగించాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు పంపించాలని చెప్పారు సైబర్ క్రిమినల్స్. వారు చెప్పిన విధంగానే… ఆయా అకౌంట్లకు 80,64,002 రూపాయలు పంపించాడు. కాల్ కట్ చేసిన తర్వాత ఇది మోసమని గ్రహించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు…
అసలు ‘డిజిటల్ అరెస్ట్’ అనే పదమే లేదని పోలీసులు చెబుతున్నారు. మోసగాళ్లు తరచూ TRAI, CBI, పోలీసు, ఇతర ప్రభుత్వ సంస్థల పేర్లను వాడి భయపెట్టే ప్రయత్నం చేస్తారని..కానీ అలాంటి వాటిని నమ్మవద్దంటున్నారు. CBI వారెంట్లు, FIRలు, సుప్రీంకోర్టు ఆర్డర్లు వంటి నకిలీ డాక్యుమెంట్లు చూపించి మోసం చేస్తారని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అంతే కాదు.. తెలియని వారికి బ్యాంక్ ఖాతా వివరాలు, OTP, వ్యక్తిగత సమాచారం ఎప్పుడూ ఇవ్వవద్దని… ఫోన్లో అసలే చెప్పవద్దని కోరుతున్నారు…
తాజావార్తలు
-
OnePlus 16T: వన్ప్లస్ 16T వచ్చేస్తోంది.. 6.3 ఇంచెస్ హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే.. స్నాప్ డ్రాగన్ 8 Elite Gen 6 ప్రాసెసర్
-
Saikrishna Custodial Death Case: సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టు.. వెలుగులోకి సంచనల విషయాలు!
-
Tamannaah Bhatia: బాలీవుడ్, టాలీవుడ్ మధ్య తేడాలపై తమన్నా సంచలన వ్యాఖ్యలు!
-
Tollywood: విమర్శలు వస్తే బ్రేక్ తీసుకోవాల్సిందేనా!
-
Chiranjeevi : అవార్డులపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!