Chennai: చెన్నైలో బీకామ్ విద్యార్థి ఆత్మహత్య.. ఓ మహిళ ఏం చేసిందంటే..!
- చెన్నైలో బీకామ్ విద్యార్థి ఆత్మహత్య
- మహిళ తిట్లకు మనస్తాపం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంత మంది విద్యార్థులు చదువుతో పాటు పార్ట్టైమ్ జాబ్లు చేస్తుంటారు. ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ల మీద నిలబడుతుంటారు. తల్లిదండ్రులకు భారం కాకూడదని చాలా మంది పిల్లలు ఖాళీ సమయాల్లో ఏదొక పని చేసుకుంటూ చదువుకుంటారు. కానీ అదే ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. మంచి ఉద్దేశంతో కష్టపడుతుంటే.. ఒక మహిళ మాటలు కారణంగా అర్ధాంతరంగా ప్రాణాలే పోయాయి. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది.

Also Read
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
జె.పవిత్రన్ (19) అనే యువకుడు చెన్నైలోని కొలత్తూరు ప్రాంతంలో ఉంటాడు. బీకాం చదువుతున్నాడు. చదువుకుంటూనే పాకెట్ మనీ కోసం కిరాణా సరుకులు డెలివరీ చేస్తుంటాడు. అయితే ఒక మహిళ అడ్రస్ తెలియక.. లేటుగా వస్తువులు డెలివరీ చేశాడు. అతగాడి ఇబ్బందులేమీ పట్టించుకోకుండా మహిళ చెడామడా.. నోటికొచ్చినట్లు తిట్లు పురాణం అందుకుంది. దీంతో ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇది కూడా చదవండి: Ambati Rambabu: చంద్రబాబు వచ్చారు.. జనాన్ని వరదల్లో ముంచారు
సూసైడ్ నోట్..
సూసైడ్ నోట్లో తన మరణానికి కారణం డెలివరీ సమయంలో బూతులు తిట్టిన మహిళనే కారణమని చెప్పాడు. ఆమె తిట్టడంతో డిప్రెషన్లోకి వెళ్లినట్లు తెలిపాడు. అలాంటి మహిళలు ఉన్నంత వరకు మరిన్ని మరణాలు సంభవిస్తాయి అంటూ పవిత్రన్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పవిత్రన్కు మహిళ ఇల్లు దొరకకపోవడంతో డెలివరీ ఆలస్యమైందని పోలీసులు తెలిపారు. లేటుగా కిరాణా సరుకులు డెలివరీ చేశాడని కస్టమర్ అయిన మహిళ యువకుడితో గొడవ పెట్టుకుందని పోలీసులు చెప్పారు. కస్టమర్.. కంపెనీకి ఫోన్ చేసి డెలివరీ బాయ్పై కంప్లెంట్ చేసింది. పవిత్రన్ను మళ్లి పంపించొద్దని కోరింది. రెండో రోజుల తర్వాత యువకుడు మహిళ ఇంటిపై రాయి విసరడంతో కిటికీ అద్దం పగిలిందని.. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో యువకుడిని మందలించి వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంతలో పవిత్రన్ ప్రాణాలు తీసుకున్నాడని వెల్లడించారు. కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి. పవిత్రన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Ridhi Bedi: వలపు వల విసిరి.. న్యూడ్ వీడియో కాల్ కి రమ్మంటాడు.. జాగ్రత్త బాసూ!
తాజావార్తలు
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
-
HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
-
OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. ‘రెడ్ జోన్’ వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!