Delhi: యువతి అద్దె రూమ్లో స్పై కెమెరా కలకలం.. బెడ్రూమ్ దృశ్యాలు రికార్డ్.. ఒకరి అరెస్ట్
- దేశ రాజధాని ఢిల్లీలో దారుణం
- యువతి అద్దె రూమ్లో స్పై కెమెరా కలకలం
- బాత్రూమ్.. బెడ్రూమ్ దృశ్యాలు రికార్డ్
- ఇంటి యజమాని కొడుకు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ ఇంటి యాజమాని కొడుకు అత్యంత నీచానికి ఒడిగట్టాడు. అద్దె ఇంట్లో ఉంటున్న యువతి దృశ్యాలను స్పై కెమెరా ద్వారా రికార్డ్ చేసి దారుణానికి ఒడిగట్టాడు. పాపం పండి భండారం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడును అరెస్ట్ చేశారు.

Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువతి ఢిల్లీలోని సెకర్పూర్లోని ఒక అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూ సివిల్స్ కోచింగ్ తీసుకుంటుంది. అయితే ఇటీవల ఆమె తన సొంత గ్రామానికి వెళ్లింది. వెళ్లేటప్పుడు ఇంటి తాళాలు.. హౌస్ ఓనర్కి ఇచ్చి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన యజమాని కొడుకు కరణ్.. మార్కెట్కు వెళ్లి స్పై కెమెరాలు కొనుగోలు చేసి బాత్రూమ్, బెడ్రూమ్ గదుల్లోని బల్బుల్లో అమర్చాడు. కరణ్… అదే ఇంట్లోని మరో అంతస్తులో ఉంటున్నాడు. అయితే ఇటీవల.. యువతి వాట్సప్ గ్రూపులో అసాధారణ కార్యకలాపాలు గుర్తించింది. అంతేకాకుండా ఒక అనుమానిత ల్యాప్టాప్ను గమనించింది. దీంతో ఆమెకు అనుమానాలు రేకెత్తించి టాయిలెట్ రూమ్ పరిశీలించగా బల్బులో స్పై కెమెరా కనిపించింది. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మరింత సోదాలు చేయగా.. బెడ్రూమ్ గదిలోని మరో బల్బుకు స్పై కెమెరా అమర్చినట్లుగా గుర్తించారు. దీంతో యువతి షాక్కు గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు కరణ్(30)ను అరెస్ట్ చేశారు.

బయటకు వెళ్లేటప్పుడు కరణ్ తాళాలు అడిగి తీసుకునేవాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆ సమయంలోనే కరణ్.. చేయాల్సిన కార్యక్రమాలను చక్కబెట్టినట్లుగా తెలుస్తోంది. దొంగచాటుగా యువతిని కరణ్ వెంటాడినట్లుగా పోలీసులు గుర్తించారు. స్పై కెమెరాలోని దృశ్యాలు మెమరీ కార్డులో రికార్డు అవుతుంటాయి. ఆ వీడియోలు ల్యాప్టాప్లో అప్లోడ్ చేసుకునేందుకు యువతి దగ్గర తాళాలు తీసుకునే మెమరీ కార్డును తీసుకునేవాడని పోలీసులు కూపీ లాగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కరణ్ ల్యాప్టాప్లో పోలీసులు కనుగొన్నారు.
కరణ్ నుంచి రికార్డ్ చేసిన వీడియోలను, స్పై కెమెరాలను, రెండు ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై భారతీయ న్యాయ్ సంహిత కింద వోయూరిజం కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం ప్రకారం నిందితుడికి కనీసం ఏడాది పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బాధితురాలు సొంత గ్రామానికి వెళ్లినప్పుడు నిందితుడు ఈ దురాగతానికి పాల్పడినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!