Delhi: యువతి అద్దె రూమ్లో స్పై కెమెరా కలకలం.. బెడ్రూమ్ దృశ్యాలు రికార్డ్.. ఒకరి అరెస్ట్
- దేశ రాజధాని ఢిల్లీలో దారుణం
- యువతి అద్దె రూమ్లో స్పై కెమెరా కలకలం
- బాత్రూమ్.. బెడ్రూమ్ దృశ్యాలు రికార్డ్
- ఇంటి యజమాని కొడుకు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ ఇంటి యాజమాని కొడుకు అత్యంత నీచానికి ఒడిగట్టాడు. అద్దె ఇంట్లో ఉంటున్న యువతి దృశ్యాలను స్పై కెమెరా ద్వారా రికార్డ్ చేసి దారుణానికి ఒడిగట్టాడు. పాపం పండి భండారం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడును అరెస్ట్ చేశారు.

Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువతి ఢిల్లీలోని సెకర్పూర్లోని ఒక అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూ సివిల్స్ కోచింగ్ తీసుకుంటుంది. అయితే ఇటీవల ఆమె తన సొంత గ్రామానికి వెళ్లింది. వెళ్లేటప్పుడు ఇంటి తాళాలు.. హౌస్ ఓనర్కి ఇచ్చి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన యజమాని కొడుకు కరణ్.. మార్కెట్కు వెళ్లి స్పై కెమెరాలు కొనుగోలు చేసి బాత్రూమ్, బెడ్రూమ్ గదుల్లోని బల్బుల్లో అమర్చాడు. కరణ్… అదే ఇంట్లోని మరో అంతస్తులో ఉంటున్నాడు. అయితే ఇటీవల.. యువతి వాట్సప్ గ్రూపులో అసాధారణ కార్యకలాపాలు గుర్తించింది. అంతేకాకుండా ఒక అనుమానిత ల్యాప్టాప్ను గమనించింది. దీంతో ఆమెకు అనుమానాలు రేకెత్తించి టాయిలెట్ రూమ్ పరిశీలించగా బల్బులో స్పై కెమెరా కనిపించింది. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మరింత సోదాలు చేయగా.. బెడ్రూమ్ గదిలోని మరో బల్బుకు స్పై కెమెరా అమర్చినట్లుగా గుర్తించారు. దీంతో యువతి షాక్కు గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు కరణ్(30)ను అరెస్ట్ చేశారు.

బయటకు వెళ్లేటప్పుడు కరణ్ తాళాలు అడిగి తీసుకునేవాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆ సమయంలోనే కరణ్.. చేయాల్సిన కార్యక్రమాలను చక్కబెట్టినట్లుగా తెలుస్తోంది. దొంగచాటుగా యువతిని కరణ్ వెంటాడినట్లుగా పోలీసులు గుర్తించారు. స్పై కెమెరాలోని దృశ్యాలు మెమరీ కార్డులో రికార్డు అవుతుంటాయి. ఆ వీడియోలు ల్యాప్టాప్లో అప్లోడ్ చేసుకునేందుకు యువతి దగ్గర తాళాలు తీసుకునే మెమరీ కార్డును తీసుకునేవాడని పోలీసులు కూపీ లాగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కరణ్ ల్యాప్టాప్లో పోలీసులు కనుగొన్నారు.
కరణ్ నుంచి రికార్డ్ చేసిన వీడియోలను, స్పై కెమెరాలను, రెండు ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై భారతీయ న్యాయ్ సంహిత కింద వోయూరిజం కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం ప్రకారం నిందితుడికి కనీసం ఏడాది పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బాధితురాలు సొంత గ్రామానికి వెళ్లినప్పుడు నిందితుడు ఈ దురాగతానికి పాల్పడినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!