Delhi: యువతి అద్దె రూమ్లో స్పై కెమెరా కలకలం.. బెడ్రూమ్ దృశ్యాలు రికార్డ్.. ఒకరి అరెస్ట్
- దేశ రాజధాని ఢిల్లీలో దారుణం
- యువతి అద్దె రూమ్లో స్పై కెమెరా కలకలం
- బాత్రూమ్.. బెడ్రూమ్ దృశ్యాలు రికార్డ్
- ఇంటి యజమాని కొడుకు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ ఇంటి యాజమాని కొడుకు అత్యంత నీచానికి ఒడిగట్టాడు. అద్దె ఇంట్లో ఉంటున్న యువతి దృశ్యాలను స్పై కెమెరా ద్వారా రికార్డ్ చేసి దారుణానికి ఒడిగట్టాడు. పాపం పండి భండారం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడును అరెస్ట్ చేశారు.

Also Read
ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువతి ఢిల్లీలోని సెకర్పూర్లోని ఒక అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూ సివిల్స్ కోచింగ్ తీసుకుంటుంది. అయితే ఇటీవల ఆమె తన సొంత గ్రామానికి వెళ్లింది. వెళ్లేటప్పుడు ఇంటి తాళాలు.. హౌస్ ఓనర్కి ఇచ్చి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన యజమాని కొడుకు కరణ్.. మార్కెట్కు వెళ్లి స్పై కెమెరాలు కొనుగోలు చేసి బాత్రూమ్, బెడ్రూమ్ గదుల్లోని బల్బుల్లో అమర్చాడు. కరణ్… అదే ఇంట్లోని మరో అంతస్తులో ఉంటున్నాడు. అయితే ఇటీవల.. యువతి వాట్సప్ గ్రూపులో అసాధారణ కార్యకలాపాలు గుర్తించింది. అంతేకాకుండా ఒక అనుమానిత ల్యాప్టాప్ను గమనించింది. దీంతో ఆమెకు అనుమానాలు రేకెత్తించి టాయిలెట్ రూమ్ పరిశీలించగా బల్బులో స్పై కెమెరా కనిపించింది. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మరింత సోదాలు చేయగా.. బెడ్రూమ్ గదిలోని మరో బల్బుకు స్పై కెమెరా అమర్చినట్లుగా గుర్తించారు. దీంతో యువతి షాక్కు గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు కరణ్(30)ను అరెస్ట్ చేశారు.

బయటకు వెళ్లేటప్పుడు కరణ్ తాళాలు అడిగి తీసుకునేవాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆ సమయంలోనే కరణ్.. చేయాల్సిన కార్యక్రమాలను చక్కబెట్టినట్లుగా తెలుస్తోంది. దొంగచాటుగా యువతిని కరణ్ వెంటాడినట్లుగా పోలీసులు గుర్తించారు. స్పై కెమెరాలోని దృశ్యాలు మెమరీ కార్డులో రికార్డు అవుతుంటాయి. ఆ వీడియోలు ల్యాప్టాప్లో అప్లోడ్ చేసుకునేందుకు యువతి దగ్గర తాళాలు తీసుకునే మెమరీ కార్డును తీసుకునేవాడని పోలీసులు కూపీ లాగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కరణ్ ల్యాప్టాప్లో పోలీసులు కనుగొన్నారు.
కరణ్ నుంచి రికార్డ్ చేసిన వీడియోలను, స్పై కెమెరాలను, రెండు ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై భారతీయ న్యాయ్ సంహిత కింద వోయూరిజం కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం ప్రకారం నిందితుడికి కనీసం ఏడాది పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బాధితురాలు సొంత గ్రామానికి వెళ్లినప్పుడు నిందితుడు ఈ దురాగతానికి పాల్పడినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
-
UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
-
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!