Delhi Murder: ఢిల్లీలో ఘోరం.. కత్తెరతో భార్య, అత్తను చంపేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Murder: దేశ రాజధానిలో ఘోరం వెలుగుచూసింది. ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 17లో ఓ వ్యక్తి తన అత్తను, భార్యను కత్తెరతో హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. కుమార్తె పుట్టినరోజున వచ్చిన బహుమతి విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో నిందితుడు తన భార్య, అత్తగారిని కత్తెరతో హత్య చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తెరలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
READ ALSO: Balakrishna : బాలయ్య మంచి మనసు.. వరద బాధితులకు రూ.50 లక్షలు
Also Read
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
ఈసందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. రోహిణిలోని సెక్టార్ 17లో యోగేష్ సెహగల్ అనే వ్యక్తి తన భార్య ప్రియ(27), అత్త కుసుమ్ సిన్హా (63), కుతూరుతో కలిసి ఉంటున్నారు. ఈక్రమంలో కుమార్తె పుట్టిన రోజున వచ్చిన బహుమతుల విషయంలో భార్యాభర్తలకు గొడవ జరిగింది. అలాగే వారి మధ్య గృహ వివాదం కూడా చోటుచేసుకుంది. దీంతో నిందితుడు యోగేష్ తన భార్య, అత్తగారిపై కత్తెరతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుంచి తప్పించుకొని పారిపోయాడు. వెంటనే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామని, విచారించిన తర్వాతే హత్య వెనుక అసలు కారణాలు తెలుస్తాయని అన్నారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
READ ALSO: Health Tips: గంటల తరబడి టాయిలెట్లో ఉంటున్నారా.. డేంజర్ బెల్స్ మోగుతాయి జాగ్రత్త
తాజావార్తలు
-
Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
-
Iran: సుప్రీం లీడర్తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
-
Fact Check: ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!