Crime News: పెళ్లికి కొన్ని గంటల ముందు యువకుడి దారుణహత్య.. తండ్రిపై అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఢిల్లీలో దారుణం జరిగింది. పెళ్లికి కొన్ని గంటల ముందు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాధితుడిని జిమ్ట్రైనర్గా పనిచేసే గౌరవ్ సింఘాల్గా గుర్తించారు. ఈ రోజు తెల్లవారుజామున అతని ముఖం, ఛాతిపై 15 కొత్తిపోట్లు పొడిచి హత్య చేశారు. అయితే, ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గౌరవ్ తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని దేవ్లీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.
హత్యకు గురైన గౌరవ్ సింఘాల్ తమ్ముడిని, బంధువులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే, హత్యకు గల కారణాలు ఇంకా కనుగొనబడలేదని, బాధితుడికి అతని తండ్రికి మధ్య ఏదో వివాదం ఉందని మాత్రమే తెలుసుకున్నామని, నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రతీ విషయం తెలుస్తుందని పోలీసులు చెప్పారు.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
Read Also: Radhika Marchant : రాధిక మర్చంట్ ధరించిన ఈ డ్రెస్సును రెడీ చెయ్యడానికి ఎన్నినెలలు పట్టిందో తెలుసా?
డీసీపీ(సౌత్) అంకిత్ చౌహాన్ మాట్లాడుతూ.. సంఘటన గురించి పోలీసులకు అర్దరాత్రి 12.30 గంటలకు కాల్ వచ్చిందని చెప్పారు. దాడి తర్వాత సింఘాల్ కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు, అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మరణించిన గౌరవ్ సింఘాల్ పెళ్లి ఈ రోజు జరగాల్సి ఉందని, ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లని డీసీపీ తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఎయిమ్స్ మార్చురీకి తరలించారు. సింఘాల్ ఫ్యామిలీ మాత్రం తమ కుటుంబంలో ఎవరిపై అనుమానం లేదని చెబుతోంది.
ఈ హత్య గురించి మొత్తం కుటుంబానికి ఎలాంటి క్లూ లేదని, ఇంటి దగ్గర ఢోల్ శబ్ధం ఉండటంతో ఎలాంటి అరుపులు కూడా వినిపించలేదని, పోలీసులు సక్రమంగా విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని బాధితుడి కుటుంబ సభ్యుడు జై ప్రకాష్ సింఘాల్ అన్నారు. ముఖం, ఛాతిపై 15 కత్తిపోట్లు ఉండటంతో బాధితుడు అక్కడిక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మరణం వెనక అసలు కారణం తెలుసుకోవడానికి అన్ని మార్గాలను ఉపయోగిస్తున్నామని, దీనిపై మొత్తం 5 టీములు పనిచేస్తున్నాయని పోలీస్ అధికారి వెల్లడించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!