Delhi Doctor Murder: ‘‘డాక్టర్ని చంపితే కూతురినిచ్చి పెళ్లి చేస్తా’’.. మర్డర్ కేసులో సంచలన విషయాలు..
- ఢిల్లీ డాక్టర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు..
- డాక్టర్ని చంపితే కూతురునిచ్చి పెళ్లి చేస్తానని నర్సు భర్త హామీ..
- మహిళా నర్సుతో డాక్టర్కి అక్రమ సంబంధం ఉందని అనుమానం..
Delhi Doctor Murder: ఢిల్లీ డాక్టర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళా నర్సుగా పనిచేస్తున్న తన భార్యతో డాక్టర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన భర్త, ప్లాన్ ప్రకారం మైనర్లతో డాక్టర్ని హత్య చేయించాడు. ఇందులో సంచలన విషయం ఏంటంటే.. నిందితుల్లో ఒకరైన మైనర్కి తన కూతురిని ఇచ్చి వివాహం చేయిస్తానని మహిళా నర్సు భర్త హామీ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది.
ఢిల్లీలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో 55 ఏళ్ల యునానీ వైద్యుడిని హత్య చేయడానికి నర్సు భర్త మైనర్ నిందితులను నియమించుకున్నాడు. అనుమానిత నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన సందర్భంలో విస్తూ పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 17 ఏళ్ల నిందితుడు మహిళా నర్సు కూతురితో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ విషయం తెలిసిన నర్సు భర్త.. డాక్టర్ని చంపితే తన కూతురిని ఇచ్చి వివాహం చేస్తానని హామీ ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
Read Also: Harsh Goenka: “భారతీయులు ధనవంతులను ఎందుకు ద్వేషిస్తారు?”
మైనర్లు ఇద్దరు ఒకే ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిసింది. నేరానికి ఉపయోగించి ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అర్థరాత్రి ఇద్దరు నిందితులలో ఒకరికి కాలికి గాయం చేసుకుని డ్రెస్సింగ్ చేయాల్సిందిగా యునానీ డాక్టర్ జావేద్ అక్తర్ ఆస్పత్రికి వద్దకు వచ్చారు. డ్రెస్సింగ్ పూర్తయిన తర్వాత ఇద్దరు మందులకు సంబంధించి ప్రిస్క్రిప్షన్ రాయించుకునేందుకు డాక్టర్ అక్తర్ క్యాబిన్కి వెళ్లారు. ఆ సమయంలో డాక్టర్ క్యాబిన్ నుంచి తుపాకీ శబ్ధాలు వినిపించాయి. సిబ్బంది లోపలికి వెళ్లి చూసేసరికి డాక్టర్ రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. ఘటనకు పాల్పడిన తర్వాత ఇద్దరు నిందితులు అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటన తర్వాత నిందితుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి.. “ఫస్ట్ మర్డర్ ఆఫ్ 2024” కామెంట్ చేశాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మహిళా నర్సు మరియు ఆమె భర్తను పోలీసులు విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!